Monday, May 13, 2024
- Advertisement -

కిలోమీటర్ల మేర బారులు తీరిన మద్యం ప్రియులు..!

- Advertisement -

కొందరు రోజుకు ఓ పెగ్ పడందే నిద్రపోరు. అలాంటిది ఒక్కటి కాదు రెండు కాదు నెలన్నర పాటు మందు లేక నాలుక పీక్కపోతుంది. ఇందులో కొందరు పిచ్చోళ్లు కూడా అయ్యారు. కొందరు కల్లు బొట్టుతో సరిపెట్టుకున్నారు. మద్యం దొరక్క మందు బాబులు పడిన కష్టం రోజు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. మద్యం లేక మందుబాబు పడుతున్న నరకయాతనకు సజీవ సాక్ష్యంగా ఏపీలోని వైన్స్ షాపులు నిలుస్తున్నాయి. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఈ మద్యం దుకాణాలు ముసేశారు.

అయితే తాజాగా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. కంటైన్మెంట్ జోన్లు తప్ప మిగతా ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు నేటి నుంచి మొదలైయ్యాయి. దీంతో ఏపీలో మందు షాపులు కళకళాడుతున్నాయి. పొద్దు పొడవకముందే మద్యంకోసం క్యూలు కట్టిన వైనం విస్తుగొలిపింది. వైన్స్ షాపుల వద్ద మందు దొరుకుతుందో లేదోనని మద్యం ప్రియులు ఏకంగా వైన్స్ దుకాణాల వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరిన వైనం చూసి షాక్ అవుతున్నారు. గుంటూరు జిల్లా బెల్లంకొండ ప్రాంతంలో ఉదయం దుకాణాలు తెరువక ముందే మందుబాబు పడిగాపులు కాశారు. నెల్లూరు – చిత్తూరు – తిరుపతి – అనంతపురం – విజయవాడ తదితర జిల్లాల్లోని వైన్స్ షాపుల వద్ద ఇదేరకంగా మందుబాబులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

పలు చోట్ల కరోనా భయం లేకుండా బౌతిక దూరం పాటించకుండా గుంపులుగా చేరారు. ఇప్పటికే పులి మీద పుట్రలా మందుబాబు దాహాన్ని క్యాష్ చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం 25శాతం ధరలను పెంచేసింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకే మద్యం అమ్మకాలు ఉంటాయి. పెరిగిన మద్యం ధర అప్ డేట్ లు సీసాలపై లేకపోవడంతో అమ్మకాలు ఆలస్యమవుతున్నాయట.. దీంతో మందు బాబులు తమకు మద్యం దొరుకుతుందో లేదోనని ఆందోళన చేస్తున్నారు. దీంతో పోలీసులు వారిని కంట్రోల్ చేసే పరిస్థితి వచ్చింది.

https://www.youtube.com/watch?v=fgeacmuq3Ng

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -