సంచనాలకు కేరాఫ్ ఎవరంటె అందరికి గుర్తుకొచ్చేది తాడిపత్రి ఎంపీ జేసీ దివాకర్రెడ్డి. ఆయన ఎప్పుడు ఏంమాట్లాడతాడో ఆయనకే తెల్వద్. ఎప్పుడు జగన్ను పొగుడుతాడో….ఎప్పుడు బాబును తిడతాడో ఎవరికి అర్థంకాడు. మీడియా ముందు ఏంమాట్లాడినా అది సంలనమే. తాజాగా ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నాని సంచలన ప్రకటన చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. అయితెజెసి ప్రకటన చేయటానికి దారితీసిన పరిస్ధితులను కాస్త నిశితంగా పరిశీలిస్తే దీనివెనుక భారీ ప్లాన్ ఉన్నట్లే అర్థమవుతోంది.
వచ్చే బుధవారం తన ఎంపి పదవికి రాజీనామా చేయబోతున్నట్లు దివాకర్ రెడ్డి ఈరోజు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. పార్టీలోను బయట ఇపుడదే విషయం హాట్ టాపిక్ అయిపోయింది. జెసి ప్రకటన చేయటానికి దారితీసిన పరిస్ధితులను కాస్త నిశితంగా పరిశీలిస్తే కొన్ని విషయాలు అర్ధమవుతాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని ఎప్పుడో ప్రకటించారు జెసి దివాకర్ రెడ్డి.
అనంతపురంలో రోడ్ల విస్తరణ చేయలేక, చాగల్లు ద్వారా మంచినీటిని తాడిపత్రికి తేవటంలో విఫలమైనందు వల్లే తాను రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు జెసి చెప్పటంలో అర్ధం లేదు. ఎందుకంటే, పై రెండు కారణాలు ఇప్పటికిప్పుడు మొదలైన సమస్యలు కావు. గడచిన మూడున్నరేళ్ళుగా ఏంచేస్తున్నట్లు.
ఇదంతా తన కొడుకు రాజకీయ భవిష్యత్తుకోసం త్యాగం చేస్తున్నారంట. అందుకే వచ్చే ఎన్నికల్లో పోటీకి ఇప్పటి నుండే దివాకర్ రెడ్డి కొడుకు పవన్ రెడ్డి రెడీ అయిపోతున్నారు. కాకపోతే ఏ పార్టీ నుండన్నది సస్పెన్స్ గా మారింది. కాని ఇక్కడే పెద్ద చిక్కుంది. టిడిపి నుండైతే టిక్కెట్టు సునాయాసంగానే తెచ్చుకుంటారనటంలో సందేహంలేదు. కాకపోతె పవన్ అటు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తో కూడా టచ్ లోనే ఉండటంతో సర్వత్రా అయోమయం మొదలైంది.
ఇప్పటికె జీసీ మీద వ్యతిరేకత ఎక్కవగా ఉంది. పని చేయలేక 2019 ఎన్నికలను ఎదుర్కొనే కన్నా ముందుగానే రాజీనామా చేసేస్తే వచ్చే ఎన్నికల నాటికి సింపతీ అయినా ఉంటుంది. ఒకవేళ సింపతీ లేకపోయినా కనీసం తన కొడుకు మీద వ్యతరేకత అయినా తగ్గుతుందని జెసి ఆలోచించి వుండవచ్చు. అందుకే తన రాజీనామాకు అబివృద్ధిని అడ్డుపెట్టుకొని రాజీనామా చేస్తున్నారనె విమర్శలు వినిపిస్తున్నాయి.