నంద్యాల ఉప ఎన్నికలకు సంబంధించిన ప్రచారం తారా స్థాయిలోకి చేరుకుంటుంది. నేతల మధ్య రోజు రోజుకి.. మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు.. గెలుపు కోసం.. జోరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ విమర్శలు మరిలో లోతుగా వెళ్తున్నాయి. అంటే మరి పర్సనల్ గా వెళ్తున్నాయి.
శోభానాగిరెడ్డి చనిపోవడానికి కారణం షర్మిలయే అని.. షర్మిల కోసమే వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో తన తల్లి చనిపోయిందని అఖిల ప్రియ వైఎస్ జగన్ పై మండి పడింది. ఇక జగన్ తన తల్లి శోభానాగిరెడ్డిని మరిచిపోయాడని ఆరోపించింది. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎదురు దాడికి దిగింది. నీ తండ్రి భూమా నాగిరెడ్డి చితి ఆరకముందే మంత్రి పదవి కోసం పాకులాడవని.. సంప్రదాయం పెద్దగా తెలియని నువ్వు.. ఇప్పుడు సంప్రదాయం గురించి మాట్లాడుతున్నావా అంటూ విరుచుకుపడింది రోజా. అసలు శోభానాగిరెడ్డి బ్రతికనంత కాలం చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాడింది, కానీ టీడీపీ ఆశలకు బలై మీ తండ్రి నాగిరెడ్డి చనిపోయిన సంగతి గుర్తు చేసుకోవాలంటూ రోజా ఆరోపణలు చేసింది.
కనీసం సొంత మామ ఎస్వీ మోహన్ రెడ్డి నీ గడప తొక్కే పరిస్థితి లేకుండా చేసుకున్నావ్ అంటూ ధ్వజమెత్తింది రోజా. జగన్ నైతికతను ప్రశ్నించే ముందు నీ గురించి నువ్వు తెలుసుకోవాలని.. నువ్వు గెలిచింది ఏ గుర్తుపై ఇప్పుడు గెలవాలనుకుంటుంది ఏ గుర్తుపైనో ఆలోచించుకోవాలని అఖిల ప్రియ పై రోజా మండిపడింది.