నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం రనరంగాన్ని తలపిస్తోంది. అధికార,ప్రతిపక్ష పార్టీల మధ్య సవాల్లు,ప్రతిసవాల్లతో దద్దరిల్లుతోంది. అధికారపార్టీ టిడిపి కి చుక్కలు చూపిస్తున్నారు వైసీపీ నాయకులు. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తే ఊరుకునేది లేదని శిల్పా చక్రపాణి రెడ్డి హెచ్చరించారు.
ప్రచారంలో టిడిపి నుంచి వైసీపీలోకి భారీగా వలసలు ప్రారంభమయ్యాయి. ప్రలోభాలకు లొంగరని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. కాగా, శిల్పా చక్రపాణి రెడ్డి సమక్షంలో 200 కుటుంబాలు వైసీపీలో చేరాయి.
టిడిపికి ఓటమి భయం టిడిపికి నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందని వైసీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం వేరుగా అన్నారు. అందుకే నంద్యాలలో గెలుపు కోసం ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతి, అరాచకాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
చంద్రబాబు గాలిని కూడా అమ్మేవారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, టిడిపి నాయకులు నంద్యాలలో తిష్టవేసి పోలీస్ పహారాలో డబ్బులు, మద్యం ఏరులై పారిస్తున్నారని తమ్మినేని ధ్వజమెత్తారు. రాత్రికి రాత్రే శిలాఫలకాలు లేకుండా టెంకాయలు కొడుతున్నారన్నారు. చంద్రబాబుకు గాలి చిక్కడం లేదని, లేకుంటే దానిని కూడా లీటర్ కొద్ది ప్యాకెట్లు కట్టి అమ్మేవారని ఎద్దేవా చేశారు.