వివాదాలకు కేరాఫ్ ఆడ్రస్ ఎవరంటె ముందుగా గుర్తుకొచ్చేది అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి. ఎవరిమీదనైన దురుసుగా ప్రవర్తించడం….ఇష్టమొచ్చనట్లు మాట్లాడటం ఆయనకు అలవాటుగా మారింది. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో జనం నోట్లో నానుతుంటారు. ఇక వైసీపీ అధినేత జగన్ మీద అయితే విమర్శలు చేయడంలో ముందుంటారు.
తాజాగా నంద్యాల ఉప ఎన్నిక వేల మరోసారి తన నోటికి పనిచెప్పారు జేసీ. జగన్,శిల్పాలై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇప్పుడు ఇవే హాట్ టాపిక్గా మారాయి. ఉపఎన్నికల నిమిత్తం జగన్, శిల్పా మోహన్ రెడ్డి చెరో రూ.50 కోట్లు నంద్యాలలో డంప్ చేశారని ఆరోపించారు. నంద్యాలలో ఇంత హంగామా అవసరం లేదని, ప్రజల్లో నమ్మకం లేని వ్యక్తి ఎంత తిరిగినా ఏముంటుదంటూ జగన్ పై విమర్శలు గుప్పించారు.
ఉప ఎన్నిక ప్రచారంలో జగన్ తనకు మీడియా మద్దతులేదని నిరూపిస్తే….ఎన్నికల నుంచి తాము తప్పుకుంటామని జేసీ సవాల్ విసిరారు.మహానేత’అంటూ 24 గంటలూ అరిగిపోయిన రికార్డులు వేస్తున్నారని,జీవితంలో జగన్ సీఎం కాలేరని అన్నారు. మరి అధికార పార్టీ నాయకులు చేస్తున్న పనులేంటొ కూడా జేసీ చెప్తే సరిపోతుంది.