- Advertisement -
సొంతపార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే తేడాలేకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేసె టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో 30 నుంచి 40 శాతం మంది టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోతే విజయం అసాధ్యమని బాంబు పేల్చారు. చంద్రబాబు విషయంలో నాకు కూడా కొన్ని అభ్యంతరాలున్నాయని జేసీ అన్నారు. తనను చూసి ఓట్లేస్తారని చంద్రబాబు అనుకుంటున్నారని.. కానీ చేసేదంతా ఎమ్మెల్యేలైతే సీఎంను చూసేదెవరని ప్రశ్నించారు దివాకర్రెడ్డి. సరిహద్దుల్లో పరిస్థితులు ఇలానే ఉంటే నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అవుతారని దివాకర్రెడ్డి పేర్కొన్నారు.