టీడీపీ, వైసీపీ ఎంపీల మధ్య మాటలయుద్ధం ముదురుతోంది. ఉదయం రాజ్యసభలో వైసీపీఎంపీ విజయసాయిరెడ్డి ప్రధానిమోదీ కాళ్లకు మొక్కారని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ విజయసాయిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే స్థాయిలో విజయసాయికూడా వారిపై ఆరోపనలు చేశారు. అయితే విజయసాయిచేసిన వ్యాఖ్యలను సుజనా చౌదరి ఖండించారు.
తమ నాయకుడు చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రయోగించిన పదజాలం సభ్య సమాజం తలదిచుకునేలా ఉందదన్నారు . ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసేలా విజయసాయి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఆయనకూడా చార్టెడ్ అకౌంటెంట్ కదాని ప్రశ్నించారు.
రాజకీయంగా విభేదాలుండొచ్చు కానీ, చంద్రబాబునాయుడు గురించి ఆయన మాట్లాడిన తీరు చాలా బాధాకరంగా ఉంది. యావత్తు ఆంధ్రప్రదేశ్ లోని తెలుగు ప్రజలు తలదించుకునేలా ఉందిని అన్నారు. భారతదేశంలో ఎన్ని రాజకీయ పార్టీలైనా ఉండొచ్చు, పార్లమెంట్ లోకి ఎవరైనా అడుగుపెట్టొచ్చు కానీ, పార్లమెంట్ పరువు తీసేలా ఉండకూదన్నారు. ఇప్పటికైనా తన తప్పు తెలుసుకుని, మీడియా ద్వారా విజయసాయిరెడ్డి క్షమాపణ చెబితే మంచిది’ అని సుజనా చౌదరి హితవు పలికారు.