Wednesday, May 1, 2024
- Advertisement -

బాబుకు మ‌రో షాక్‌.. వైసీపీలోకి టీడీపీ ఎంపీ ఫ్యామిలీ..

- Advertisement -

ఎన్నిక‌ల వేల టీడీపీకి షాక్‌లు త‌గులుంటే…ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే రెండు పార్టీలు కొన్ని ముఖ్య‌మైన అసెంబ్లీ సీట్లు త‌ప్ప మిగితా అన్ని స్థానాల‌కు అభ్య‌ర్తులు ఖ‌రార‌యిన‌ట్లు తెలుస్తోంది. ఈ సారి అధికారంలోకి రావాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న జ‌గ‌న్ అందుకు త‌గ్గ‌ట్టుగానే వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఎన్నిక‌ల షెడ్యూల్ కూడా విడుద‌ళ అవ‌డంతో జ‌గ‌న్ స్పీడ్ పెంచారు. అధికార పార్టీ టీడీనీలో ఉన్న బ‌ల‌మైన అభ్య‌ర్తుల‌ను పార్టీలో చేర్చుకొనేదానిపై దృష్టిసారించారు.

ఇప్ప‌టికే టీడీపీనుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. తాజాగా మంత్రి దేవినేని ఉమా సోద‌రుడు, సినీన‌టుడు అలీ వైసీపీ తీర్థం పుచ్చుకున్న కున్నారు. ఇద‌లా ఉంటే తాజాగా తోట న‌ర‌సింహం ఫ్యామిలీ కూడా వైసీపీలో చేరేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు.

ఎన్నిక‌ల షెడ్యూల్ విడ‌దుళ అయిన వెంట‌నే తోట న‌ర‌సింహం ఫ్యామిలీ టీడీపీకీ గుడ్ బాయ్ చెప్పేసింది. రెండు రోజుల్లో తోట నరసింహం ఫ్యామిలీ వైసీపీలో చేరనుంది. టికెట్ విష‌యంలో కొద్ది రోజులుగా పార్టీ అధినేత బాబుపై తోటా ఫ్యామిలీ గుర్రుగా ఉన్నారు. తోట నరసింహం భార్య వాణి ఆదివారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు.

ప్ర‌స్తుతం కాకినాడ ఎంపీగా ఉన్న తోట న‌ర‌సింహం ఈ సారి ఎంపీగా పోటీ చేయ‌న‌ని..దానికి బ‌వులు త‌న భార్య‌కు వాణికి జగ్గంపేట అసెంబ్లీ టిక్కెట్టును ఇవ్వాలని ఆయన చంద్రబాబునాయుడును కోరారు. అక్క‌డ‌నుంచి వైసీపీ త‌రుపున పోటీ చేసి ఫిరాయించిన ఎమ్మెల్యే జ్యోతుల‌నెహ్రూకే బాబు టికెట్ క‌న్ఫ‌మ్ చేశారు. దీంతో టిక్కెట్టుపై చంద్రబాబునాయుడు నుండి స్పష్టత రాని క్రమంలోనే తోట నరసింహాం కుటుంబం టీడీపీకి గుడ్‌బై చెప్పినట్టు ప్రచారం సాగుతోంది. రెండు రోజుల్లో తోట న‌ర‌సింహం ఫ్యామిలీ ఫ్యాన్ గూటికి చేర‌నున్నారు. కాకినాడ లేదా పెద్దాపురం అసెంబ్లీ స్థానాల నుండి తోట వాణి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసే అవకాశం ఉంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -