పవన్పై అధికారపార్టీ నేతలనుంచి మాటల దాడి షురూ అయ్యింది. ఏకంగా నేతల మూకుమ్మడిగా మాటల దాడి పెంచారు. మిస్టర్ పవన్ కల్యాణ్.. ఎవరి మెప్పు కోసం ఈవిధంగా మాట్లాడుతున్నారు? ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు చెప్పాలంటూ వర్లరామయ్య ప్రశ్నించారు. పవన్కు ముందుంది ముసల్ల పండగన్నారు. వాస్తవాలకు దూరంగా పవన్ గాలి కబుర్లు చెపుతున్నారు. ఆరోపణలు చేసినప్పుడు దాన్ని నిరూపించాలని సవాల్ విసిరారు.
బీజేపీతో కలిసిన పవన్ కల్యాణ్ జీరో స్థాయికి వచ్చేశారని ఏపీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. బీజేపీ డైరెక్షన్ లో పవన్ వెళ్తున్నారని, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి ఏపీకి రూ.75 వేల కోట్లు రావాలని చెప్పిన పవన్, ఆ విషయాన్ని జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ రోజుకో మాట మాట్లాడుతున్నారని, చంద్రబాబుకు మార్కులు ఇచ్చే రాజకీయ పరిణతి పవన్ కు ఉందా? అని ప్రశ్నించారు. రాజకీయంగా పవన్ కు మెచ్యూరిటీ లేదని అన్నారు. ఎవరో అనుకుంటుంటే విన్నానంటూ నారా లోకేశ్ పై ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని మండిపడ్డారు.