అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ల షాక్లు తగులుతున్నాయి.అసలే ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్న తరుణంలో టీఆర్ఎస్ నాయకులు కూడా తప్పుల మీద తప్పులు చేస్తున్నారు.తాజాగా ఓ టీఆర్ఎస్ నాయకుడు ప్రచారంలో భాగంగా నిర్వహించిన మీటింగ్లో మాట్లాడుతు..కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు గురించి వివరించారు.తరువాత జై కేసీఆర్,జై తెలంగాణ అంటూ… కారు గుర్తుకే మన ఓటు అనబోయి చేయి గుర్తుకే మన ఓటు అని అన్నారు.
యథా రాజా తథ ప్రజలు అన్నట్లు కార్యకర్తలు కూడా చేయి గుర్తుకే మన ఓటు అని అనడం విశేషం.తరువాత నాయకుడుతో పాటు కార్యకర్తలు కూడా తప్పుగా స్లోగన్లు ఇస్తున్నామని గ్రహించి నాలుక కరుచుకున్నారు.నేను ఏది అంటే మీరు అదే అంటారా అంటూ కార్యకర్తలపై కొపం చూపించారు ఎమ్మెల్యే అభ్యర్థి.ఇక తెలంగాణ ఎన్నికలలో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్ఎస్ నాయకులకు చేదు అనుభావాలు ఎదురు అవుతున్నాయి.మీరు ఏం చేశారని ప్రజలు టీఆర్ఎస్ లీడర్లు తిరగబడుతున్నారు.