ఎస్ ఐఆర్ చాలా సీరియస్ అంశం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్ఐ ఆర్ పైన జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…సర్ పైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంఛార్జ్ లు మరింత అప్రమత్తంగా ఉండాలి..కొందరు నాయకులు సర్ పైన నిర్లక్ష్యంగా ఉంటున్నారు అన్నారు.
పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊర్కొం.. సర్ అవగాహన సదస్సు లపైన జిల్లాల వారీగా నా దగ్గర రిపొర్ట్ ఉంది.. కాంగ్రెస్ పార్టీ తరుపున సర్ పైన అవగాహన సదస్సులు మరిన్ని జరగాలి. సర్ పైన ఇంఛార్జీ మంత్రుల మరింత బాధ్యతాయుతంగా వ్యవహారించాలి అన్నారు.
సర్ విషయంలో సరిగా వ్యవహారించకపోతే పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది.. పేదల ఓట్లు పోతే వాళ్ల ఆధార్ కార్డు, రేషన్ కార్డు పోతుంది.. వాళ్లకు అన్యాయం జరగనివ్వొద్దు ..పార్టీ ఆదేశాలను ఎవరైనా పాటించాల్సిందే.. సర్ పైన పార్టీ ఆదేశాలను పట్టించుకోని గుర్తించి వారి స్థానంలో మరొక ఇంఛార్జ్ ని నియమిస్తాం అన్నారు.
ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని క్షమించం.. పని చేయకుండా పార్టీకి నష్టం కల్గిస్తామంటే చూస్తు ఉర్కొం.. పది రోజుల సమయం ఇచ్చి చూస్తాం..పార్టీ సర్పంచ్ లతో సర్ పైన గ్రామాల్లో ప్రచారం చేయించి అవగాహన కల్పించాలి అన్నారు.
