Sunday, May 19, 2024
- Advertisement -

టికెట్ ఇస్తే జ‌గ‌న్‌కు బంఫ‌ర్ ఆఫర్ ఇచ్చిన బిల్డ‌ర్‌

- Advertisement -

ఉత్త‌రాంధ్ర జిల్లాలో వైసీపీకీ బ‌లం పెరుగుతోంది. ఆ పార్టీలోకి వ‌ల‌స‌లు ఊపందుకున్నాయి. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన ప్ర‌ముఖ బిల్డ‌ర్ ఎంవివి సత్యనారాయణ పార్టీ కండువా క‌ప్పుకొనేందుకు సిద్దంగా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అక్క‌డినుంచి ఎంపీగా పోటీచేయ‌డానికి ఉత్సాహం క‌న‌బ‌రుస్తున్నారు. టికెట్ కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇప్ప‌టికే వైసీపీలోకి ఓ కీల‌క నేత‌ను క‌ల‌సి చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నపుడు జగన్ ను కలవాలని ప్రయత్నించినా సాధ్యం కాకపోవటంతో కీలక నేతను మాత్రం కలిశారు. ఆయ‌న సానుకూలంగా స్పందిచిన‌ట్లు తెలుస్తోంది.

ఒకవేళ తనకు ఎంపి టిక్కెట్టు ఇస్తే పార్టీకీ బంఫ‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారంట బిల్డ‌ర్‌. త‌న ఖ‌ర్చుల‌తో పాటు ఎంపి నియోజకవర్గం పరిధిలో పోటీ చేసే అసెంబ్లీ అభ్యర్ధులకు కూడా తానే ఖర్చులు పెట్టుకుంటా అని హామీ ఇచ్చారట. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుండి పోటీలోకి దింపవచ్చని ఓ ప్రచారం జరుగుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే జగన్ విశాఖపట్నంలో పాదయాత్ర మొదలుపెట్టే సమయంలో పార్టీ తీర్ధం పుచ్చుకోవటానికి బిల్డర్ సిద్ధంగా ఉన్నారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -