వైసీపీ మహిళా ఫైర్బ్రాండ్ రోజా మరోసారి అధికార పార్టీపై రెచ్చిపోయారు.బాబు,పవన్లను దుమ్ముదులిపారు.చేనేత సమస్యలపై జనసేన అధినేత, కాటన్ రాయుడు పవన్ కళ్యాణ్ స్పందించడేమిటని రోజా ప్రశ్నించారు. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండి కూడా ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. చంద్రబాబు ఏ జిల్లాలో చేనేత పార్కులు ఏర్పాటు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.
కాటమరాయుడు సినిమా విడుదల సమయంలో తాను కాటన్ రాయుడును అంటూ పవన్ కళ్యాణ్ పబ్లిసిటీ చేసుకున్నారని రోజా ధ్వజమెత్తారు. కానీ ఇప్పుడు మాత్రం మౌనంగా ఉంటున్నారన్నారు. జగన్ మాటిస్తే వైయస్ రాజశేఖర రెడ్డి మాటిచ్చినట్లేనని, మాట తప్పరు, మడమ తిప్పరు అన్నారు. వైసిపి అధికారంలోకి రాగానే చేనేత సమస్యలను పరిష్కరిస్తారన్నారు.
పనిలో పనిగా చంద్రబాబును కూడా ఏకేశారు.చంద్రబాబు మంత్రులు అందరూ కంత్రీలు, ఎమ్మెల్యేలు అందరూ కాలకేయుళ్లేనని రోజా అన్నారు. మహిళా సాధికారత పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే… రిషికేశ్వరి మరణానికి కారకులు ఎవరు? ఉత్తరాంధ్ర మంత్రి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, ఆ మంత్రిని చంద్రబాబు తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో మహిళలు చాలా అభద్రతభావంతో ఉన్నారని ఆమె పెర్కొన్నారు. అందకు కారణం తెలుగు దేశం పార్టీ నేతలని విమర్శించారు. అస్సలు టిడిపి పార్టీ నాయకులకు రక్షబంధన్ శుభాకాంక్షలు చెప్పే అర్హత లేదని ఆమె ధ్వజమెత్తారు.ఏపీలో మహిళల ప్రాణ, ధన, మాన రక్షణకు భద్రత లేదన్నారు. దేశంలో నలుగురు మంత్రులపై ఆరోపణలు ఉంటే, అందులో ఇద్దరు ఏపీ వారే అన్నారు.