సినీ నటి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా నెటిజన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన రోజా ప్రత్యర్థులను రెచ్చగొట్టడంలోను…వారికి సమాధానాలు చెప్పడంలోను వెన్నతో పెట్టిన విద్య. అలాంటి రోజాకు నెటిజన్ తీవ్ర ఆగ్రహం రప్పించాడు. దీంతో ముక్కుపుటాలు అదురుతుండగా…’ఆ వెధవ ఎవడో కనిపిస్తే చెప్పుతో కొట్టాలని ఉంద’ని రోజా మండిపడ్డారు.
ఓఛానల్కు ఇచ్చిన ఇంటర్వూలో రోజాకు గుండుకొట్టినట్టు ఉన్న ఫోటోను చూపించినపుడు వెంటనే తీవ్రఆగ్రహానికి గురైన రోజా.. ముక్కుపుటాలు అదురుతుండగా..వాడెవడో కనిపిస్తే చెప్పుతో కొట్టాలని ఉందని అన్నారు. ఈ ఫోటోలు కేవలం తనకు మాత్రమే పెట్టలేదని, ఇలాంటి ఫోటోలు చాలా మంది వైఎస్సార్సీపీ నేతల ఫోటోలకు పెట్టాడని మండిపడ్డారు.
తాము తలచుకుంటే టీడీపీ నేతల పెళ్లాలకు గుండ్లు కొట్టేలా మార్ఫింగ్ ఫోటోలు పెట్టలేమా? అని ఆమె నిలదీశారు. వాడెవడో ఒక అబ్బాఅమ్మకి పుట్టి ఉంటే ఇలాంటి పని చేస్తాడా?…వాడిని ఏం చెయ్యాలి అని ఆమె ప్రశ్నించారు. టీడీపీని అభిమానించడం తప్పుకాదని చెప్పిన ఆమె ఇలాంటి కుసంస్కారులు ఆ పార్టీలో చాలా మంది ఉన్నారని ఆమె మండిపడ్డారు.