Monday, May 20, 2024
- Advertisement -

స్పీడ్ పెంచిన జ‌గ‌న్‌…

- Advertisement -

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌డానికి చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు. ఇప్ప‌టికే పాద‌యాత్ర పూర్తి చేసిన జ‌గ‌న్‌…త్వ‌ర‌లో బ‌స్సుయాత్ర‌కు రెడీ అవుతున్నారు. త‌ట‌స్థంగా ఉన్న ఓట్ల‌పై దృష్టిపెట్టిన జ‌గ‌న్ త‌న స్పీడ్‌ను పెంచారు. ఉద్యోగులు, త‌ట‌స్థంగా ఉన్న ఓట‌ర్ల ఆక‌ర్శించేదానికి అన్న పిలుపు కార్య‌క్ర‌మాన్ని మొద‌లు పెట్టిన సంగ‌తి తెలిసిందే.

అన్న పిలుపు కార్య‌క్ర‌మంలో భాగంగా త‌ట‌స్థుల‌కు లేఖ‌లు కూడా జ‌గ‌న్ రాశారు. మొద‌ట సొంత జిల్లా క‌డ‌ప‌లో ఉద్యోగుల‌కు మొద‌ట లేఖ‌లు పంపారు. లేఖపై పార్టీ గుర్తు ఫ్యాన్‌, జగన్‌ ఫొటోను ముద్రించారు. ఫిర్యాదు ఇచ్చేందుకు ఆఖరున ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ కూడా ఇచ్చారు. ఉద్యోగుల‌ను ప్ర‌శంశిస్తూనే ఏపీ ప్రగతికి మీ సలహాలు తీసుకోవాలని ఆశిస్తున్నానని జగన్ లేఖలో పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -