- Advertisement -
పేద, మధ్య తరగతి కుంటుంబాలకు మేలు జరిగేలా వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకన్నారు.పేదవారు మొదలుకొని ఏడాదికి రూ. 5లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి ప్రతి ఒక్కరికి కొత్తగా యూనివర్సల్ హెల్త్ కార్డులు తీసుకువస్తానని వైఎస్ జగన్ ప్రకటించారు. నెలకు రూ. 40 వేల వరకు జీతం ఉన్నవారికి ఉచితంగా వైద్య సేవలు అందనున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఇది ఎంతో లబ్ధి చేకూర్చుతుందని ఆయన అన్నారు. గుంటూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వైద్యం ఖర్చు రూ.1000 దాటితే యూనివర్సల్ హల్త్ కార్డు ద్వారా సహాయం అందుతుందన్నారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది ప్రైవేటు, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఊరట లభిస్తుందని జగన్ చెప్పారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి ముస్తాఫాను, గుంటూరు పశ్చిమ అభ్యర్థి ఏసురత్నంను, గుంటూరు ఎంపీ అభ్యర్థిగ వేణుగోపాల్రెడ్డిని గెలించమని కోరారు