Wednesday, April 24, 2024
- Advertisement -

తెలంగాణ ఆడబిడ్డలకు అండగా ఉంటా : వైఎస్ షర్మిల

- Advertisement -

గత కొన్ని రోజులుగా తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ బీభత్సాన్ని కొనసాగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. వచ్చేనెల 10 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. అయితే కరోనా కారణంగా రాష్ట్రంలో ఎంతో మంది మరణించారు.. కుటుంబ పెద్దలు చనిపోవడంతో అనాధలుగా మారుతున్నారు. ఇక తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తీసుకు వస్తానంటూ వచ్చారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల.

ఇప్పటికే తెలంగాణ సర్కార్ పై పలు రకాలుగా విమర్శలు ఎక్కుపెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె తెలంగాణ ఆడబిడ్డలకు అండగా ఉంటానని వైఎస్ షర్మిల అన్నారు. కరోనా కారణంగా తమకు కావాల్సినవాళ్లను కోల్పోయిన మహిళలకు తనవంతు సాయం చేస్తానని తెలిపారు. కరోనాతో కుటుంబ పెద్ద దిక్కు కోల్పోయిన మహిళలకు ఆర్థిక సాయం అందిస్తానని షర్మిల ట్విటర్ వేదికగా వెల్లడించారు.

తెలంగాణ ఆడబిడ్డలారా… దైర్యం కోల్పోకండి.. కుటుంబ పెద్ద దిక్కు తండ్రి / భర్త / కొడుకును కరోనా కు కోల్పోయి కుటుంబాన్ని నెట్టలేక నిరాశ, నిస్పృహలతో కృంగిపోతున్న మహిళల భాదను కాస్తైనా పంచుకోవడానికి నా వంతుగా మీకు ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నాను. మా ఫోన్ నెంబరు: 040-48213268 అంటూ ఆమె ట్వీట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -