Saturday, April 20, 2024
- Advertisement -

వైఎస్‌ షర్మిల కీలక నిర్ణయం

- Advertisement -

రాజన్న యాదిలో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు మరియు గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు “ఊరూరా వైయస్ఆర్ జెండా పండుగ” నిర్వహించాలని YSR తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైయస్ షర్మిల నిర్ణయించారు. ఆగస్టు 5వ తేదీ నుంచి ఈ జెండా పండుగ నిర్వహించాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. గ్రామాలు, మండలకేంద్రాలు, పట్టణాలు, నగరాల్లో YSR తెలంగాణ పార్టీ జెండాలు ఆవిష్కరించాలని కోరారు.

ఆగస్టు 5వ తేదీన గురువారం YSR తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైయస్ షర్మిల గారు పార్లమెంటరీ కన్వీనర్, కో-కన్వీనర్లతో సమావేశం కానున్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించి, నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. కొత్త కమిటీ సభ్యులకు పార్టీ బలోపేతంపై సలహాలు ఇవ్వనున్నారు. వైయస్ఆర్ సంక్షేమ పాలనను ప్రతీ గడపకూ చేరవేసేలా నాయకులకు సూచనలు చేయనున్నారు.

వైయస్ఆర్ స్వర్ణయుగ పాలన తిరిగి తెచ్చేలా కార్యాచరణ రూపొందించనున్నారు. కార్యక్రమంలో వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధులు ఇందిరా శోభన్, మహమ్మద్ ముస్తబా, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -