నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల నామినేషన్ల పర్వం ముగియడంతో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇరు పక్షాల నుంచి హేమా హేమీలు ప్రాచారంలో పాల్గొంటున్నారు.నంద్యాల అంతా యుద్ద వాతావరనాన్ని తలపిస్తోంది. వైసీపీ బహిరంగ సభతర్వాత మరింత దూకుడు పెంచింది. తాజాగా ఆపార్టీ ఫైర్ బ్రాండ్ రోజా తాజాగా తమ అభ్యర్తికి 16 వ వార్డులో ప్రచారం నిర్వహించారు.
అయితే ప్రచారంలో ప్రజలు రోజాకు పడుతున్న బ్రహ్మరథాన్ని చూసి టీడీపీ నేతల్లో అలజడి మొదలయ్యింది.దీంతో ప్రచారాన్ని అడ్డుకోవడానికి కుట్రలకు తెరలేపింది.ఇంతలో హటాత్తుగా వందల సంఖ్యలో మహిళలు వచ్చి గోల చేయటం మొదలుపెట్టారు. ఎక్కడి నుండి వచ్చారో, ఎందుకు వచ్చారో కూడా వైసీపీ నేతలకు అర్ధం కాలేదు.
వచ్చిన మహిళ్ళల్లోని కొందరిని వైసీపీ శ్రేణులు గుర్తించగలిగారు. వారిని పట్టుకుని మెల్లిగా ఆరాతీయగా టిడిపి వాళ్లు డబ్బులిచ్చి రోజా ప్రచారానికి అంతరాయం కలిగించమని తమను పంపారని బయటపెట్టారు. దాంతో ప్రచారం సందర్భంగా పెద్ద గొడవైంది.
పోలీసులు అక్కడకు చేరుకోని టీడిపి పంపగా వచ్చిన జనాలను చెదరగొట్టారు.ఈసందర్భంలోనె ఇరు వర్గాల మధ్య తోపులాటజరిగింది.ఎన్నికల్లో గెలవలేమని తెలుసుకొనే టీడీపీ ఎలాంటి కుట్రలకు పాల్పడుతుందో అర్థమవుతోంది.