చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడుకు గతంలో అలిపిరి వద్ద జరిగిన ఘటన భగవంతుడు తన వైఖరిని మార్చుకోమని చేసిన వార్నింగ్ అని, నేడు అదే దైవాన్ని దోచుకునే నీచమైన ప్రక్రియను చంద్రబాబు చేస్తున్నారని రాంబాబు విమర్శించారు. బాబు దేవుని విషయంలో పద్దతి మార్చుకోకపోతే వడ్డీతో సహా మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.
ధర్మపోరాట దీక్ష ప్రదేశాన్ని శుద్ది చేసేందుకు వెళుతున్న ఎంపీ విజయసాయి రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణం. పోలీసులను చంద్రబాబు తన జేబు సంస్ధగా చేసుకున్నారు. ఇది ప్రజాస్వామ్య విరుద్దం. మరోవైపు తిరుమల పోటులో తవ్వకాలపై విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలపై ప్రభుత్వం స్పందించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
రమణదీక్షితుల ఇంట్లో వైఎస్ఆర్ ఫోటో ఉండబట్టే.. ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ అని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. వైఎస్ఆర్ హయాంలో పేద బ్రాహ్మణుల కోసం కృషి జరిగిందని అని చెప్పుకొచ్చారు.