Aఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి వైసీపీ సీనీయర్ నేత ఆనం రామ్నారాయణ రెడ్డి నిప్పులు చెరిగారు. నాడు నరకాసురుడు ప్రజలను హింసిస్తే… నేడు నారా సురుడు బాధిస్తున్నాడని ఘాటుగా విమర్శించారు. బెల్ట్ షాపులు తీసేయ్యలేదని, ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగితే పట్టించుకోలేదని, అవినీతి పెరిగిందని, ఇసుకాసురులు పెరిగిపోయారని ధ్వజమెత్తారు.
2019 ఎన్నికల్లో నారాసురుడి రాజకీయ సంహారంతోనే ఏపీ ప్రజలకు నిజమైన దీపావళి వస్తుందన్నారు. హుదూద్, తిత్లీ తుఫాన్లతో చంద్రబాబు లబ్దిపోందుతున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా బాధితులకు ఇచ్చే చెక్లపై బాబు తన పోటోను వేసుకోవడం సిగ్గు చేటన్నారు.
నాలుగున్నరేళ్లకాలంలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు బాబు దిగజార్చారని మండిపడ్డారు. లక్షన్నర్రకోట్ల అపులు తీసుకొచ్చి ఏంచేశారని ప్రశ్నించారు. ఆర్థికంగా చంద్రబాబు, ఆయన కుటుంబం మాత్రమే లాభపడిందని ఆరోపించారు. చంద్రబాబు తీరు గురవింద సామెతను తలపిస్తుందని విమర్శించారు.
ఆపరేషన్ గరుడ అని చెప్పిన వ్యక్తిని ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. పోలీస్ శాఖలు ఎక్కడ పనిచేస్తున్నాయని, ఇంటలిజెన్స్ శాఖ పక్క రాష్ట్రంలో ఓట్లు కొనుగోలు చేయడం ఏంటని నిలదీశారు.