Thursday, May 2, 2024
- Advertisement -

కొత్త ఎమ్మెల్యేల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్న జ‌గ‌న్ నివాసం..

- Advertisement -

ఇటీవ‌లే జ‌రిగిన ఎన్నిక‌ల్లో 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్లు గెలుచుకొని అఖండ విజ‌యం సాధించింది. ఈనె 30న జ‌గ‌న్ ఏపీసీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. ప్ర‌మాణస్వీకారాణికి ముందు తాడేప‌ల్లిలోని జ‌గ‌న్ నివాసంలో వైఎస్ఆర్ ఎల్పీ స‌మావేశం జ‌రుగుతోంది. వైఎస్ఆర్ ఎల్పీ నాయ‌కుడిగా జ‌గ‌న్‌ను ఎన్నుకొని తీర్మానాన్ని గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌సి ఆయ‌న‌కు అంద‌జేయ‌నున్నారు.

ఇద‌లా ఉంటె ఎన్నికైన కొత్త ఎమ్మెల్యేల‌తో జ‌గ‌న్ నివాసం క‌ళ‌క‌ళ‌లాడుతోంది. వైఎస్ఆర్ ఎల్పీ స‌మావేశం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఎమ్మెల్యేలంద‌రూ జ‌గ‌న్ నివాసానికి చేరుకుంటున్నారు. దీంతో పోలీసులు క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌ను ఏర్పాటు చేశారు.

తాడేపల్లి నుంచి హైదరాబాద్ వెళ్తారు జగన్. గవర్నర్ ను ప్రత్యేకంగా కలిసి ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన శాసనసభాపక్ష తీర్మానాన్ని నరసింహన్ కు అందజేస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిందిగా ఆహ్వానించాలని కోరుతారు . గవర్నర్ తో భేటీ అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను గౌరవపూర్వకంగా కలుస్తారు జగన్. భవిష్యత్తులో అనుసరంచాల్సిన వ్యూహంపై ఇద్దరూ చర్చలు జరుపుతారు .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -