ప్రధాని మోదీ, చంద్రబాబు ఇద్దరూ కలసి డ్రామాలు ఆడుతున్నారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. బాబు అవినీతికి సంబందించి కేంద్రం దగ్గర పక్కా ఆధారాలుంటే ఆయనపై ఎందుకు విచారణ ఎందుకు జరిపించడంలేదని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి నాలుగేళ్లపాటు బీజేపీకి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కనిపించలేదా? అని అడిగారు.
చంద్రబాబు, ఆయన బినామీలు కలసి రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నరని ఆరోపనలు చేశారు. బాబు అండతో టీడీపీ నేతలు అక్రమ వ్యాపారాలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇష్టారాజ్యంగా క్వారీ తవ్వకాలు జరుగుతున్నా, అమాయకులు ప్రాణాలను కోల్పోతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.
ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్లే ప్రాణాలంటే లెక్క చేయకుండా పేలుళ్లు జరిపారని ఆరోపించారు. 5 లక్షల రూపాయలు ఇచ్చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని.. ఇకపై అటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు