ఏపీ సీఎం చంద్రబాబుకు వైసీపీ బహిరంగ సవాల్ విసిరింది. గెలుస్తానే నమ్మకముంటే అసెంబ్లీనీ రద్దు చేసి తెలంగాణాలోలాగా ముందస్తు ఎన్నికలకు సిద్ధంకండీ అంటూ ఛాలెంచ్ చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. పార్టీ అధికారం కోసం ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడి చి …గెలుపు కోసం ప్రతి ఎన్నికలో అవకాశవాద పొత్తులు పెట్టుకుంటున్నారని ఎద్దేవ చేశారు.
1996లో సీపీఐ, సీపీఎంలతో 1999, 2004లో బీజేపీతో, 2009లో మహాకూటమి పేరుతో సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్తో కలిసి పోటీ చేశారని, 2014లో మళ్లీ బీజేపీతో జతకట్టారని గుర్తు చేశారు. స్వలాభం కోసం ఇప్పుడు మరో సారి బద్ధశత్రువైన కాంగ్రెస్తో పొత్తుకు సిద్ధమయ్యారని నిప్పులు చెరిగారు. తిక విలువలతో ఒంటరిగా ఒక్క ఎన్నికనైనా చంద్రబాబు గెలిచారా? అంటూ ప్రశ్నించారు.
2014లో బీజేపీ, ‘జనసేన’తో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. 22 మంది ఫిరాయింపుదారులపై వేటు వేయండి. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మంత్రి వర్గంలో ఉన్న నలుగురిని డిస్మిస్ చేయండి. ఫిరాయింపుదారులపై వేటు వేసిన మర్నాడే అసెంబ్లీకి వస్తాం’ అని వైసీపీ పేర్కొంది.
డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదని వాళ్లే చెప్పారని, మహిళల గొంతు కోసి ఇప్పుడు అనైతిక పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో టీడీపీ అవినీతికి పాల్పడిందని, అసెంబ్లీలో లేకపోయినా ప్రజల్లో ఉండి పోరాడుతున్నామన్నారు. కాంగ్రెస్, బీజీపీతో పొత్తులు పెట్టుకోమని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.