Saturday, May 4, 2024
- Advertisement -

చంద్ర‌బాబుకు స‌వాల్ విసిరిన వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు వైఫల్యానికి ప్రతీక వైఎస్‌ జగన్‌ పాదయాత్ర అని, బాబుకు గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను రూ.2.26 లక్షల కోట్ల అప్పుల్లో టీడీపీ ప్రభుత్వం ముంచేసిందని పెద్దిరెడ్డి విమర్శించారు. ఏది నిర్మించకుండానే ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టేసారని ఆయన ధ్వజమెత్తారు. బాబు పాలనలో రైతులు 92 శాతం మంది అప్పులో మునిగిపోయారన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ను రూ.2.26 లక్షల కోట్ల అప్పుల్లో టీడీపీ ప్రభుత్వం ముంచేసిందని పెద్దిరెడ్డి విమర్శించారు. ఏది నిర్మించకుండానే ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టేసారని ఆయన ధ్వజమెత్తారు. బాబు పాలనలో రైతులు 92 శాతం మంది అప్పులో మునిగిపోయారన్నారు.

ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీలపై పోటీకి పెడతానని అంటున్నారని, ఉప ఎన్నికలొస్తే చంద్రబాబు రెఫరెండంగా తీసుకోవాలని పెద్దిరెడ్డి సవాలు విసిరారు. చంద్రబాబు చేయించిన సర్వేలో 30 మంది ఎమ్మెల్యేలకు మించి గెలవరని తేలింది ఆయన పేర్కొన్నారు. మా ఎంపీలపై చంద్రబాబు పోటీ చేస్తే.. మేం గెలిస్తే రాజీనామా చేయాలని’ పెద్దిరెడ్డి సవాల్‌ విసిరారు. అంతేకాక ప్రజలందరూ రానున్న ఎన్నికల్లో బాబుకు బుద్ధి చెప్పడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -