Friday, May 3, 2024
- Advertisement -

వైసీపీ ఎమ్మెల్యే సంధించిన ప్రశ్నలకు పవణ్ దగ్గర సమాధానాలు ఉన్నాయి….?

- Advertisement -

రాజధాని గందరగోలం నేపథ్యంలో జనసేన అధినేత పవన్ రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నారు.రాజధాని గ్రామాల్లో పర్యటిస్తూ రాజధానికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈనేపథ్యంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పవన్ కు కొన్ని ప్రశ్నలు సంధించారు.రాజధాని గ్రామాల్లో పర్యటించబోతున్న పవన్ ముందు తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని ఎంఎల్ఏ డిమాండ్ చేస్తున్నారు.

చంద్రబాబునాయుడు దగ్గర నుండి ప్యాకేజి అందినపుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రోడ్లమీదకు వస్తున్నది వాస్తవం కాదా ?

రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కుంటే తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఎన్నికలకు ముందు పవన్ చెప్పిన మాట అబద్ధమేనా ? అన్నది రెండో ప్రశ్న.

ఎన్నికలకు ముందు మాట్లాడుతూ రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడినట్లు పవన్ చేసిన ఆరోపణలు తప్పా ?

అప్పుడు చంద్రబాబు అవినీతిపరుడని చెప్పిన పనవ్ మళ్ళీ ఎందుకు ఆ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు ?

ఏదో పొత్తుల్లో భాగంగా మిత్రపక్షానికి ఇచ్చారని అనుకున్నా మరి అభ్యర్ధి విజయానికి ఎందుకు కనీసం ప్రచారానికి కూడా రాలేదు ?

నారా లోకేష్ విజయానికి లోపాయికారీగా పవన్ ప్లాన్ చేసింది నిజంకాదా ? అన్నది ఏడో ప్రశ్న.

రాజధాని ప్రాంతంపై పవన్ కు నిజంగానే అంత ప్రేముంటే ఇక్కడ ఎందుకు పోటి చేయలేదు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -