Thursday, May 2, 2024
- Advertisement -

బాబు ఔట్‌ డేటెడ్‌ సీఎం… వైసీపీ ఎమ్మెల్యే రోజా

- Advertisement -

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏపీ సీఎం చంద్ర‌బాబుపై మండిప‌డ్డారు. పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తూ డ్వాక్రా మ‌హిళ‌ల‌ను మ‌రో సారి మోసం చేస్తున్నార‌ని ఆరోపించారు. స‌కాలంలో డ్వాక్రా రుణాల‌ను మాఫీ చేసింటే …అక్కా చెళ్లెమ్మ‌ల ఆత్మ‌హ‌త్య‌లు జ‌రిగేవి కాద‌న్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున పసుపు-కుంకుమ పేరుతో మరోసారి మోసానికి దిగారని మండిపడ్డారు. మహిళల తాళిబొట్టులు తెంపే విధంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని, మహిళల ద్రోహి చంద్రబాబు అని త్రీవస్థాయిలో ధ్వజమెత్తారు.

పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులతో ఔట్‌ డేటెడ్‌ సీఎం కొత్త నాటకాలకు తెరలేపారని రోజా ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ అరాచ‌కాలు పెరిగిపోవ‌డంతోనే మంత్రి సునీత‌పై ప్ర‌జ‌ల‌ను చెప్పులు, చీపుర్ల‌తో తిరుగ‌బాలు చేశార‌న్నారు. విసిరార‌న్నారు. మహిళలకు న్యాయం చేయలేని సునీత.. వైఎస్‌ జగన్‌ను విమర్శించడం తగదని హితవుపలికారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేయగల సత్తా మీకు ఉందా ఉందా సవాలు చేశారు.చిత్తూరులో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై టీడీపీ నేతల దాడిని రోజా ఖండించారు.

అమ్మకి అన్నం పెట్టలేని వ్యక్తి.. చిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తానంటాడని’’ వైఎస్, చంద్రబాబును ఉద్దేశిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించేవారని రోజా గుర్తుచేశారు. మ‌రో సారి డ్వాక్రామ‌హిళ‌ల‌ను మోసం చేసేందుకు పసుపు-కుంకుమ పథకంలో ఆడబిడ్డలకు రూ.10 వేలు ఇస్తున్నారని రోజా ఆరోపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -