కృష్ణా జిల్లా మచిలీపట్నం బస్టాండ్లో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, టీడీపీ నేత వర్ల రామయ్య బస్సులోని ఓ దళిత యువకుడిపై చేసిన వ్యాఖ్యల వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పటికే అన్ని వర్గాలనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మండిపడింది.
తన స్థాయిని మర్చిపోయిరంటూ ప్రతిపక్ష ఎంపీ వరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్ల రామయ్య పిల్లలు ఫోన్లు వాడరా? అని ప్రశ్నిస్తూ… పేదలకు ఒక న్యాయం, రామయ్య బిడ్డలకు ఒక న్యాయమా అని వరప్రసాద్ నిలదీశారు. ఇలా కులం గురించి అడగటం ఏంటని, తన స్థాయిని మరచి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు.
గతంలో దళితులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా దారుణంగా మాట్లాడారు. కనీసం క్షమాపణలు చెప్పినట్లు కూడా చెప్పలేదు. ఇక ఆయన కింద పనిచేసే నాయకులు అంతకంటే గొప్పగా మాట్లాడతారని అనుకోలేం’ అని వరప్రసాద్ వ్యంగాస్త్రాలు సంధించారు.