ప్రస్తుతం టెలికాం రంగంలో ఆఫర్ల యుద్దం నడుస్తోంది. తాజా టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ రెండు రకాల ఆఫర్లను ప్రకటించేసింది. అందులో.. భాగంగా.. ఒకటి రూ.349 ప్లాన్ కాగా, మరొకటి రూ.5 ప్లాన్. ఈ రెండు ప్లాన్స్ యూజర్లను తెగ ఆకర్శిస్తున్నాయి. అలాగే, పలు రకాల రీచార్జ్లపై క్యాష్ బ్యాక్ ఆఫర్ను కూడా ఎయిర్టెల్ ప్రకటించింది.
మొదట రూ.349 ఆఫర్.. 28 జీబీ డేటాతోపాటు అన్లిమిటెడ్ లోకల్, ఎస్.టి.డి కాల్స్ చేసుకునే సౌలభ్యం కల్పించింది. ఇది 28 రోజుల కాలపరిమితి కలిగివుంటుంది. అలాగే, రూ.5తో మరో ఆఫర్.. ఇది కేవలం 4జీ సిమ్కు మైగ్రేట్ అయ్యేవాళ్ల కోసం. ఎయిర్టెల్ నెట్వర్క్లోనే ఉన్న కస్టమర్లు తమ సిమ్ను 4జీకి మార్చుకుంటే వాళ్లకు కేవలం రూ.5 రీచార్జ్తో 4 జీబీ డేటా ఇవ్వనుంది. అయితే ఇది ఒక్కసారి మాత్రమే రీచార్జ్ చేసుకోవచ్చు.
దీని వ్యాలిడిటీ 7 రోజులు. కేవలం డేటా మాత్రమే వాడుకోవచ్చు. ఫోన్ కాల్స్ ఉండవు. ఇకపోతే, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి రీచార్జ్ చేసుకునేవాళ్లకు 5 శాతం క్యాష్బ్యాక్ ఆఫర్ను ప్రకటించింది. ఒక్కో ట్రాన్సక్షన్కు గరిష్టంగా రూ.25 క్యాష్బ్యాక్ ఇస్తున్నారు. ఉదాహరణకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని అందులో నుంచి రూ.349 ప్యాక్ వేసుకుంటే 10 శాతం అంటే రూ.34.9 క్యాష్బ్యాక్ను అందిస్తారు.