Thursday, May 2, 2024
- Advertisement -

బాబుపై మోజేల మేధావి(?) చలసాని? సిగ్గులేనితనమా? అమాయకత్వమా?

- Advertisement -

మేధావుల సంఘం అధ్యక్షుడిని అని చలసాని శ్రీనివాస్ చెప్పుకుంటూ ఉంటాడు. ఆ మేధావుల సంఘం ఏంటో? ఈయన మేధావి అని ఎవరైనా సర్టిఫికెట్ ఇచ్చారో? లేక తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నాడో తెలియదు కానీ ఈయనను మాత్రం టిడిపి భజన మీడియా సూపర్ పాపులర్ చేస్తూ ఉంటుంది. జెపి, పవన్‌ల లాగే ఈయన కూడా సిసలైన బాబు భజన బృందం సభ్యుడే. ఇతర సమయాల్లో ఎలా ఉన్నా కూడా బాబుకు అవసరమైన టైంలో మాత్రం …..అన్నీ వదిలేసి బాబుకు సాయం చేస్తూ ఉంటాడు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చిన ఒక మగానుభావుడు ఈయనే. సమైక్యాంధ్రప్రదేశ్ కోసం నిరాహార దీక్షకు దిగిన ప్రజాబలం ఉన్న నాయకుడైన జగన్‌కి అస్సలు సపోర్ట్ చేయలేదు. సీమాంధ్ర నుంచి ఉన్న అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొచ్చేలా చేసింది ఏమీ లేదు. రాష్ట్ర విభజన కంటే కూడా సమైక్యాంధ్ర క్రెడిట్ జగన్‌కి రాకూడదు. తెలంగాణా ఏర్పాటు చేయమని లెటర్ ఇచ్చిన నాయకుడు, తెలంగాణాను విభజించండి అని సోనియాను డిమాండ్ చేసిన నాయకుడు, ఒక్కసారి కూడా సీమాంధ్రప్రయోజనాల గురించి కానీ, సమైక్యాంధ్ర గురించి కానీ మాట్లాడని చంద్రబాబు సీమాంధ్రుల దృష్టిలో విలన్ అవ్వకూడదు అన్న లక్ష్యంతో పచ్చ మీడియాలో పోరాటం చేసి సమైక్యాంధ్ర ఉద్యమానికి తూట్లు పొడిచిన నాయకుల లిస్టులో ఈయన కూడా ప్రముఖుడే.

ఇక ఇప్పుడు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు అనే పేరుతో మరోసారి మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. ప్రజా పోరాటాన్ని నిర్మించడమో, నిజాయితీగా సమైక్యాంధ్ర కోసం పోరాడడమో అస్సలు ఉండదు. కానీ హోదా వేస్ట్…..ప్యాకేజ్ బెస్ట్ అన్న బాబు ఇమేజ్ సీమాంధ్రుల దృష్టిలో డ్యామేజ్ అవ్వకుండా మాత్రం గొప్పగా రాజకీయం చేస్తూ ఉంటాడు. ఇక హోదా కోసం పోరాటం చేస్తున్న జగన్ చిత్తశుద్ధిపై సీమాంధ్రులకు సందేహం వచ్చేలా…..జగన్ పోరాటానికి సీమాంధ్రులు మద్దతివ్వకుండా ఉండేలా మాత్రం లోపాయికారి రాజకీయం చాలానే చేస్తూ ఉంటాడు.

ఇక తాజాగా ఈ చలసాని వారు అమూల్యమైన మాట సెలవిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశ పటంలో లేకుండా చేయాలని బిజెపి చూస్తోందని అన్నారు. దమ్ముంటే టిడిపి ప్రభుత్వంలో ఉన్న బిజెపి మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వైదొలగాలన్నారు.

అర్రే డైలాగులు అదిరిపోయాయి కదా……మరి అదే నోటితో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న టిడిపి కేంద్ర మంత్రులు దమ్ముంటే రాజీనామా చేయాలని ఎందుకు అడగరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశ పటంలో లేకుండా చేయాలన్న లక్ష్యంతో సాగుతున్న బిజెపితో నాలుగేళ్ళుగా చంద్రబాబు కలిసి సాగుతున్న చంద్రబాబును ఏమనాలి? అంటే బాబు, మోడీలు కలిసి ఆంధ్రప్రదేశ్‌ని భారతదేశ పటంలో లేకుండా చేయాలని చూస్తున్నారా? ఆంధ్రప్రదేశ్‌ని నాశనం చేయాలని నార్త్ ఇండియా నాయకులు అనుకుంటే నిజంగా వాళ్ళు ద్రోహులే. మరి ఆంధ్రప్రదేశ్‌ని నాశనం చేస్తున్న అలాంటి మోడీకి సీమాంధ్ర నుంచి ఓట్లేయించి…..నాలుగేళ్ళుగా వాళ్ళు నాశనం చేస్తూ ఉన్నా తన స్వార్థం తాను చూసుకున్న సీమాంధ్ర ముద్దు బిడ్డ చంద్రబాబు ఇంకెంత ద్రోహి అవుతాడు? ఏం చలసాని వారు? అమాయకత్వంతో బాబు ద్రోహం తెలుసుకోలేకపోతున్నారా? లేక బాబుకు మంచి చేయడం కోసం సిగ్గులేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి ద్రోహం చేస్తున్నారా?

సీమాంధ్రకు తీవ్ర ద్రోహం జరుగుతూ ఉంటే అప్పటి కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వంతో, కాంగ్రెస్‌తో కుమ్మక్కయిన సీమాంధ్ర ముద్దు బిడ్డ బాబు రెండు కళ్ళ సిద్ధాంతం పాట పాడుతూ తన స్వార్థం చూసుకున్నాడు. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్‌ని భారతదేశ పటంలో లేకుండా చేయాలని చూస్తోంది అని మీరు ఆరోపిస్తున్న అదే బిజెపికి ప్రధాన భాగస్వామిగా ఉన్నాడు అదే సీమాంధ్ర ముద్దుబిడ్డ నారా చంద్రబాబునాయుడుగారు. మరి ఆ సీమాంధ్ర ముద్దుబిడ్డ చంద్రబాబునాయుడి తప్పులు మీకు అస్సలు కనిపించవా? అమాయకత్వమా? బాబుకు మేలు చేయడం కోసం సిగ్గులేని రాజకీయాలా సెల్ఫ్ సర్టిఫైడ్ మేధావీ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -