“మాహిష్మతి .. సామ్రాజ్యం .. ఆస్మాకం .. అజేయం” అనే పాట బాహుబలి రిలీజ్ అయ్యినప్పటి నుండి పాడుకుంటున్నాం.. మనవరకు అయితే ఈ మాహిష్మతి అనే సామ్రాజ్యం పేరు వినడం అప్పుడే మొదటిసారి. అయితే బాహుబలి సినిమా చూసాక మాహిష్మతి నిర్మాణాన్ని చూసి ఆశ్చర్యపోయాం. రాజమౌళి ఊహాశక్తిని చూసి వందల కోట్లు బహుమానంగా ఇచ్చేసాం.
కాని ఎప్పుడైనా ఆలోచించారా ఈ మాహిష్మతి అనే పేరుతొ నిజంగానే ఏదైనా రాజ్యం ఉందో లేదో ? మాహిష్మతి అనే పేరుతో నిజంగానే రాజ్యం ఉండేది. అది కూడా ఎక్కడో కాదు.. మన దేశంలోనే. అయితే ఆ రాజ్యం వేరు.. రాజమౌళి మహిష్మతి వేరు. రాజ్యం పేరు మాత్రమే వాడుకున్నారు. భావన నిర్మాణాలు, యుద్దరీతులు .. అన్ని రాజమౌళి సృష్టించినవే. కంప్యూటర్ గ్రాఫిక్స్ తో సృష్టించిన మాహిష్మతికి, అసలైన మాహిష్మతికి చాలా తేడాలున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.
{loadmodule mod_custom,Side Ad 1}
అసలైన మాహిష్మతి రాజ్యం గురించి ముచ్చట్లు ఇప్పుడు చూద్దాం.. రామాయణంలో మాహిష్మతి వివరాలున్నాయి తెలుసా ? ఇక్ష్వాకు కొడుకు దశాశ్వ మాహిష్మతిని పరిపాలిస్తున్నప్ప్పుడు రావణుడు మాహిష్మతిపై దాడికి దిగాడట. పద్మపురాణంలో కూడా మాహిష్మతి గురించి సమాచారం ఉంటుంది. దీనిని నిర్మించిన రాజు పేరు మాహిష అని కొన్న్ని గ్రంధాలలో ఉంటే, ఆ రాజు పేరు మాహిష్మాంత్ అని మరికొన్ని గ్రంథాల్లో ఉంది. ఇద్దరు ఒకరేనా కాదా అనే విషయం తెలియదు. కాని ఎవరు నిర్మించినా, ఆ రాజు పేరు మీదే దీనికి మాహిష్మతి అనే పేరు వచ్చింది అని తెలుస్తోంది.
{loadmodule mod_sp_social,Follow Us}
Related