బాహుబలి 2 మూవీ విడుదల అయ్యి.. రెండు వారాలు అవుతున్న బాహుబలి 2 రికార్డ్ లు వేట కొనసాగుతునే ఉంది. ఇప్పటికే దాదాపు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఉన్న అన్ని రికార్డులను ఈ సినిమా తుడిచి పెట్టేసింది. ఈ మూవీలో నటించిన నటీనటులందరికి మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా రాజమాత శివగామి పాత్రలో రమ్యకృష్ణ అద్బుత నటన కనబర్చింది. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడులోనూ ఇప్పటివరకు ‘నీలాంబరి’గా ప్రేక్షకుల మదిలో స్థానాన్ని సంపాదించిన రమ్యకృష్ణను ఇప్పుదు దేశవ్యాప్తంగా ‘శివగామి’ అని పిలుస్తున్నారు.
అంతగా ఆ పాత్రలో లీనమైపోయింది రమ్యకృష్ణ. ‘నా మాటే శాసనం’ అంటూ ఒకవైపు రాజసం ప్రదర్శిస్తూనే సెంటిమెంట్ను కూడా అద్భుతంగా పండించింది. ఇంతటి విజయంలో కీలకపాత్ర పోషించిన రమ్యకృష్ణకు బాహుబలి 2 సినిమాలో ఓ సీన్ ఏడుపు తెప్పించిందట. ఆ సీన్లో నటిస్తున్నప్పుడు కంటే తెరపై చూస్తున్నప్పుడే ఎక్కువ భావోద్వేగానికి గురైందట రమ్యకృష్ణ. బాహుబలిని చంపిన తర్వాత శివగామి వద్దకు కట్టప్ప వచ్చి నిజాలను చెప్పే సీన్స్ రమ్యకృష్ణను కంటతడి పెట్టించాయట.
{loadmodule mod_custom,Side Ad 1}
నేను నేపథ్య సంగీతం లేకుండా హైదరాబాద్లో నిర్వహించిన ఓ ప్రదర్శనలో సినిమా చూశా. శివగామి వద్దకు కట్టప్ప వచ్చి నిజాలను వెల్లడించే సన్నివేశాలు వచ్చినపుడు నాకు ఏడుపు వచ్చేసింది. ఈ సీన్ ఎంతో భావోద్వేగంతో కూడుకున్నది అయినప్పటికీ.. అందులో నాకు ఒక్క డైలాగ్ కూడా ఉండదు. ఆ సీన్ రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు నిదర్శమ’ని రమ్యకృష్ణ.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}_r5rSVEOulo{/youtube}
Related