Saturday, May 25, 2024
- Advertisement -

బాహుబలి 2 చూసి.. తెగ ఏడ్చేసిన రమ్యకృష్ణ..

- Advertisement -
Ramya Krishna Crying That scene

బాహుబలి 2 మూవీ విడుదల అయ్యి.. రెండు వారాలు అవుతున్న బాహుబలి 2 రికార్డ్ లు వేట కొనసాగుతునే ఉంది. ఇప్పటికే దాదాపు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఉన్న అన్ని రికార్డులను ఈ సినిమా తుడిచి పెట్టేసింది. ఈ మూవీలో నటించిన నటీనటులందరికి మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా రాజమాత శివగామి పాత్రలో రమ్యకృష్ణ అద్బుత నటన కనబర్చింది. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడులోనూ ఇప్పటివరకు ‘నీలాంబరి’గా ప్రేక్షకుల మదిలో స్థానాన్ని సంపాదించిన రమ్యకృష్ణను ఇప్పుదు దేశవ్యాప్తంగా  ‘శివగామి’ అని పిలుస్తున్నారు.

అంతగా ఆ పాత్రలో లీనమైపోయింది రమ్యకృష్ణ. ‘నా మాటే శాసనం’ అంటూ ఒకవైపు రాజసం ప్రదర్శిస్తూనే సెంటిమెంట్‌ను కూడా అద్భుతంగా పండించింది. ఇంతటి విజయంలో కీలకపాత్ర పోషించిన రమ్యకృష్ణకు బాహుబలి 2 సినిమాలో ఓ సీన్‌ ఏడుపు తెప్పించిందట. ఆ సీన్‌లో నటిస్తున్నప్పుడు కంటే తెరపై చూస్తున్నప్పుడే ఎక్కువ భావోద్వేగానికి గురైందట రమ్యకృష్ణ. బాహుబలిని చంపిన తర్వాత శివగామి వద్దకు కట్టప్ప వచ్చి నిజాలను చెప్పే సీన్స్ రమ్యకృష్ణను కంటతడి పెట్టించాయట.

{loadmodule mod_custom,Side Ad 1}

నేను నేపథ్య సంగీతం లేకుండా హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ ప్రదర్శనలో సినిమా చూశా. శివగామి వద్దకు కట్టప్ప వచ్చి నిజాలను వెల్లడించే సన్నివేశాలు వచ్చినపుడు నాకు ఏడుపు వచ్చేసింది. ఈ సీన్‌ ఎంతో భావోద్వేగంతో కూడుకున్నది అయినప్పటికీ.. అందులో నాకు ఒక్క డైలాగ్‌ కూడా ఉండదు. ఆ సీన్‌ రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు నిదర్శమ’ని రమ్యకృష్ణ.  

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}_r5rSVEOulo{/youtube}

Related

  1. బాహుబలికి ఈ పాపకు మధ్య సంబంధం ఏంటో తెలుసా..?
  2. బాహుబలి గా ముందు ఏ హీరోని తీసుకున్నారో తెలుసా..?
  3. బాహుబలి 2 పై పవన్‌ షాకింగ్ కామెంట్స్.. అనందంలో రాజమౌళి
  4. బాహుబలి కి షాక్ ఇచ్చిన ఉయ్యాలవాడ ఫస్ట్ లుక్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -