సొంత బావ చేతిలో ఓ యువతి హత్యకు గురైయింది. సౌమ్య అనే 19 ఏళ్ల అమ్మాయి జీడిమెట్లో ఉంటూ డిగ్రీ చదువుతోంది. ఇక బోరబండ పర్వతనగర్లో సౌమ్య బావ కృష్ణయ్య క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. వీరికి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యలు నిర్ణయం తీసుకున్నారు. అయితే సౌమ్య ఇటివలే వేరే అబ్బాయితో క్లోజ్ గా ఉంటుందని.. జీర్ణించుకోలేని కృష్ణయ్య.. సౌమ్యను హత్య చేసి కూకట్పల్లిలోని ఐడీఎల్ చెరువులో శవాన్ని పడేశాడు.
తర్వాత కూకట్పల్లి పోలీసులకు లొంగిపోయాడు. సౌమ్యను తానే చంపానని.. చెరువులో పడేశానని.. వేరే వ్యక్తితో క్లోజ్ గా ఉంటుందన్న అనుమానంతోనే తనను చంపేశానని కృష్ణయ్య పోలీసులకు చెప్పాడు. దాంతో పోలీసులు సౌమ్య మృతదేహాన్ని వెలికితీయించారు.కాలేజీలో చదువుతున్న సౌమ్య మరొకరితో చనువుగా ఉంటుందన్న అనుమానంతో కోపం పెంచుకున్న కృష్ణయ్య ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. ఈ నెపథ్యంలో మాట్లాడాలంటూ.. సౌమ్యను హెచ్ఎంటీ ప్రాంతంలోని ఖాళీ ప్రదేశానికి రమ్మన్నాడు.
మాట్లాడుతుండగా మాటామాట పెరిగి కోపంతో కొట్టడంతో.. సౌమ్య అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని సంచిలో కట్టుకుని తన వాహనంలో తీసుకువచ్చి కూకట్పల్లి ఐడిఎల్ చెరువులో పడవేశాడు. అనంతరం పర్వత్నగర్లోని తన ఇంటికి వెళ్లి సాయంత్రం కూకట్పల్లి పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. అయితే అప్పటికే చీకటి పడటంతో సౌమ్య మృతదేహాన్ని శనివారం ఉదయం వెలికితీశారు. సౌమ్యనే పెళ్లి చేసుకోవాలనుకున్న కృష్ణయ్య.. ఆమె ఇతరులతో చనువుగా ఉండటం సహించలేకనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసులు చెప్పారు.