Wednesday, May 8, 2024
- Advertisement -

మనవడి బర్త్ డేకు.. మానస పుత్రికే వేదిక !

- Advertisement -

నారా వారి ఇంట బుల్లబ్బాయి దేవాన్ష్ సందడి అంతా ఇంతా కాదు. ఏడాది కాలంగా.. బాబు నుంచి బాలయ్య దాకా.. ఇంటి ముచ్చట్లు చెప్పమంటే.. ముందుగా చెప్పేది దేవాన్ష్ గురించే. లోకేష్, బ్రాహ్మణిల గారాల పట్టి అయినా ఈ బుల్లబ్బాయి.. నారా వారి వారసుడు కాబట్టే అంత మురిపెం, ముచ్చట చూపిస్తున్నారు.

చూస్తుంటే.. దేవాన్ష్ పుట్టి ఏడాది గడిచిపోయింది. తిథుల ప్రకారం.. ఈ ఏడాది ఉగాది నాడు.. అతడి మొదటి పుట్టిన రోజు కూడా వచ్చేసింది. ఈ సందర్భాన్ని.. చంద్రబాబు తన మానస పుత్రిక అయిన అమరావతి వేదికగా.. రంగరంగ వైభవంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేసేస్తున్నారు.

ఏప్రిల్ 8న అమరావతిలో జరిగే తన మనవడు దేవాన్ష్ పుట్టిన రోజుకు.. మంత్రులు, ఉన్నతాధికారులు అంతా కుటుంబ సమేతంగా రావాలని.. బుల్లబ్బాయిని ఆశీర్వదించి వెళ్లాలని బాబు ఇన్వైట్ చేశారు. ఇంగ్లిష్ డేట్ల ప్రకారం.. ఈ నెల 21నే.. తన మనవడి పుట్టినరోజు చేశామని.. మళ్లీ తెలుగు సంప్రదాయం ప్రకారం.. తెలుగు తిథుల ప్రకారం చేస్తున్న వేడుకకు హాజరు కావాలని ఆహ్వానం పంపారు.

అసలే వేదిక అమరావతి.. ఆపై పుట్టిన రోజు చేసుకునేది మనవడు దేవాన్ష్. ఇంకేముంది.. మానస పుత్రిక వేదికగా.. మనవడి బర్త్ డే సెలెబ్రేషన్ ను.. బాబు అదిరిపోయేలా చేస్తారని తెలుగు తమ్ముళ్లు అంచనా వేసేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -