పంజాబ్ రాష్ట్రంలో ఓ ఉమెన్ టీచర్ చేయకుడని పని చేసింది. కామంతో కళ్లుమూసుకుని.. తన వద్ద చదువుకునే ఓ బాలుడిని తన కొరిక తీర్చాలంటూ వేధించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వార్త సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలా జిల్లాలోని ఘనోర్ అనే గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉంది. ఇందులో ఓ మహిళ టీచర్ ప్రధానోపాధ్యాయురాలిగా పని చేస్తుంది.
అదే స్కూలో చదువుకునే 17 యేళ్ళ బాలుడితో కోరిక తీర్చుకోవాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలో ట్యూషన్ చెపుతానంటూ ఆ బాలుడిని ఇంటికి పిలిపించుకుని రాత్రిపూట ఇంట్లోనే ఉంచుకునేది. అతని అడిగినవి ఇస్తూ.. తన వలలో వేసుకునేందుకు ప్రయత్నించింది. తర్వాత ఒంటరిగా పనుకోవడం భయం అని చెప్పి.. ఆ బాలుడిని రెచ్చగొట్టింది. దీంతో బెంబేలెత్తిపోయిన ఆ బాలుడు.. టీచరమ్మ ఇంట్లో తాను అనుభవిస్తున్న వేధింపులను తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో తన కుమారుడితో శారీరక సంబంధం పెట్టుకున్న ప్రధానోపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాలుడి తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు.
దాంతో ఈ సంఘటనపై దర్యాప్తు జరిపిన పాఠశాల విద్యా కార్యదర్శి కిషన్ కుమార్, సర్కిల్ విద్యాధికారిణి నిషా జలోటాలు బాలుడిని లైంగికంగా వేధించిన ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్కు గురైన ప్రధానోపాధ్యాయురాలు రెండేళ్ల క్రితం మరో స్కూలు బాలుడితో కలిసి నృత్యం చేస్తూ వెలువడిన వీడియో అప్పట్లో సంచలనం రేపిందని అధికారులు గుర్తు చేస్తున్నారు. కాగా, పాఠశాల బాలుడి పట్ల ప్రధానోపాధ్యాయురాలి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండేదని తోటి ఉపాధ్యాయులు చెప్పడం విశేషం.