Tuesday, May 14, 2024
- Advertisement -

దేవుడా………‘కమ్మ’ని డామినేషన్‌ని తట్టుకోవడం ఎలా?

- Advertisement -

సాక్షాత్తూ స్పీకర్ స్థాయి వ్యక్తి పదేళ్ళ తర్వాత పవర్‌లోకి వచ్చాం……..మళ్ళీ మన కులాన్ని దాటి అధికారం పోకూడదు అని సెలవిస్తాడు. ఇక నాయుడంటేనే నాయకుడు అని చంద్రబాబుకు అన్నలాంటి వెంకయ్యనాయుడు గర్వంగా చెప్పుకుంటాడు. ఇక ఇప్పుడు తాజాగా తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామిని ఏకంగా తిరుమల వెంకన్న చౌదరిగా సరికొత్తగా నామకరణం చేసేశాడు మురళీ మోహన్.

‘కమ్మ’ని ప్రేమను పక్కన పెడితే ఎస్సీ ఎస్టీలతో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని సాక్షాత్తూ ముఖ్యంమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబే చులకనగా మాట్లాడేస్తాడు. ఇక ఎస్సీలు చదువుకోరు అని చెప్పి చంద్రబాబు కేబినెట్‌లోని మంత్రివర్యులు బూతులు లంకించుకుంటారు. ఇక యూట్యూబ్ ఛానళ్ళలో, సోషల్ మీడియాలో కమ్మ జపం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న జనాభాలో కమ్మని వాళ్ళు చాలా తక్కువ శాతం. అయినప్పటికీ చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ……….ఆయన కులం జనాలందరూ కూడా ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారు బాబు భజన బృందంలో ముఖ్య సభ్యుడైన రాధాకృష్ణనే తన వీకెండ్ కామెంట్‌లో చాలా సార్లు వివరించాడు. ఈ కుల పిచ్చి ఈ రేంజ్‌లో ఉంటే ఇక బెజవాడ ఎప్పటికి అగ్రశ్రేణి నగరం అయ్యే అవకాశమే లేదు అని ఆవేదన వ్యక్తం చేశాడు.

సామాన్య జనాలు మాత్రం ఈ పచ్చ బ్యాచ్ తీరుతో విసుగెత్తిపోతున్నారు. ఎంత చంద్రబాబునాయుడు అధికారంలో ఉంటే మాత్రం ప్రభుత్వం అంతా కూడా తమ సొత్తు……..తిరుమల వెంకన్న కూడా చౌదరినే అని చెప్పి బాబు కులం నాయకులందరూ కూడా రెచ్చిపోవడాన్ని మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ హర్షించరు అనడంలో సందేహం లేదు. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్‌తో సహా కేంద్ర ప్రభుత్వ సూచనలు అన్నింటినీ పక్కన పెట్టి కుల జనాభాకు దగ్గరగా ఉండేలా రాజధాని ఉండాలని అడ్డంగా నిర్ణయం తీసుకున్న చంద్రబాబు…….ఈ కుల రాజకీయాలను ఇంకా ఏ స్థాయిలో ప్రోత్సహిస్తారో చూడాలి మరి. ఈ కుల పిచ్చిని తట్టుకోలేక ఇతర కులాల జనాలందరూ కూడా పచ్చ పార్టీ దూరమైతే మాత్రం కనీసం రెండు శాతం, మూడు శాతం ఓట్లు కూడా టిడిపి దక్కించుకునే అవకాశం లేదు. చంద్రబాబు అండ్ బ్యాచ్ నమ్ముకుంటున్న సొంత కులం జనాభా శాతం అంతే మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -