ప్రస్తుతం ఏపీ లో రాజకీయ శూన్యత నడుస్తోంది అంటున్నారు విశ్లేషకులు పేరుకి చాలా పార్టీలు ఉన్నా ఎవ్వరినీ నమ్మలేని పరిస్థితి లో ఉన్నారు జనాలు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీ కి బుద్దోచ్చే విధంగా గడ్డి తినిపించిన జనాలు 2019 ఎవరికి ఓటు వెయ్యాలి అనే విషయం లో ఇప్పటికే అంతా సిద్దం చేసుకుంటున్నారు.
ఎవరెవరు పాలనా వ్యవస్థలో సరిగ్గా వ్యవహరిస్తున్నారు, ఎవరెవరు ప్రభుత్వాన్ని కూలగోట్టడమే తమ ధ్యేయంగా పెట్టుకున్నారు ఇలాంటివి బాగా అబ్జర్వ్ చేస్తున్న జనాలు పవన్ కళ్యాణ్, జగన్ మోహన్ రెడ్డి లలో ఎవరిని నమ్మాలి అనే విధంగా ఉంది ప్రస్తుత చర్చ. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం నడుస్తున్నా, సాధ్యమైనంత వరకూ పనులు చేస్తున్నా భవిష్యత్తులో ఒకవేళ ప్రజలు టీడీపీని కాదనుకుంటే ప్రత్యాన్మాయంగా ఎవరిని ఎన్నుకుంటారు అనేది పెద్ద ప్రశ్నగా తోస్తోంది. ఉన్న ప్రతిపక్షం వైసీపీ ఎప్పటికప్పుడు బలహీనపడుతూ సానుభూతిని మూటకట్టుకుంటోంది తప్ప పనులు చేస్తుందన్న నమ్మకాన్ని మాత్రం కలిగిచలేకపోతోంది.
ఇక జనసేన పార్టీ చూస్తే ఇప్పటి వరకూ పూర్తిస్థాయి సంస్థాగత నిర్మాణాన్ని ఇంకా పూర్తి చేసుకోలేదు. దీంతో జనాలు జగన్ ని నమ్ముకోవాలా లేకపోతే పవన్ వెనుక నడవాలా అన్న డైలామాలో పడ్డారు. 2019 నాటికి ఈ రెండు పార్టీల్లో ఏది మెరుగ్గా కనబడితే దానికే ప్రజాదరణ దక్కే అవకాశం ఎక్కువగా ఉంది.