Friday, May 17, 2024
- Advertisement -

భార‌త బౌల‌ర్ల ధాటికి చేతులెత్తేసిన పాక్‌…

- Advertisement -

ఆసియాకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు చెలరేగారు. బౌల‌ర్ల ధాటికి 162 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఏదలోనూ పాక్‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా బౌల‌ర్లు క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్ వేయ‌డంతో త‌క్కువ స్కోరుకే క‌ట్ట‌డి చేశారు. బ్యాట్స్ మెన్ పూర్తిగా బ్యాట్లు ఎత్తేశారు. 43.1 ఓవర్లలో కేవలం 162 పరుగులకే పాకిస్థాన్ ఆలౌట్ అయింది. బాబర్ ఆజం (47), హైదరాబాద్ అల్లుడు షోయబ్ మాలిక్ (43) మినహా మరెవరూ క్రీజులో నిలవలేక పోయారు.

పార్ట్‌టైం బౌలర్‌ కేదార్‌ జాదవ్‌ (3/23), పేసర్లు భువనేశ్వర్‌(3/15), బుమ్రా(2/23)ల దెబ్బకు దాయాదీ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. స్కోరు బోర్డుపైకి 3 పరుగులు చేరకుండానే భువనేశ్వర్ కుమార్ పాక్ ఓపెనర్లు ఇమాం ఉల్ హక్ (2), ఫక్తర్ జమాన్ (డకౌట్)లను పెవిలియన్ చేర్చాడు.

అనంతరం బరిలోకి దిగిన బాబర్ , షోయబ్ లు సమయోచితంగా ఆడుతూ 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ తరుణంలో జట్టు స్కోరు 85 పరుగులు ఉన్నప్పుడు బాబర్ ను కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో… పాక్ పతనం ప్రారంభమైంది. ఆ వెంటనే 96 పరుగుల వద్ద షోయబ్ మాలిక్ రనౌట్ (అంబటి రాయుడు) అయ్యాడు. ఆ తర్వాత సర్ఫరాజ్ (6), ఆసిఫ్ అలీ (9), షాదాబ్ ఖాన్ (8), ఫహీమ్ అష్రఫ్ (21), హసన్ అలీ (1), ఉస్మాన్ ఖాన్ (డకౌట్)లు వచ్చినవాళ్లు వచ్చినట్టుగా పెవిలియన్ చేరారు. 18 పరుగులతో మొహమ్మద్ ఆమిర్ నాటౌట్ గా నిలిచాడు.

భారత బౌలర్లలో బుమ్రా, జాదవ్ లు చెరో మూడు వికెట్లు పడగొట్టారు. బుమ్రా 2 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టాడు. ధోనీ రెండు క్యాచ్ లు పట్టడమే కాకుండా, ఒక స్టంపింగ్ చేయడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -