ఈ నెల 15 నుంచి ఆసియా కప్ 2018 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్లో పాల్గొనే భారత జట్టు సభ్యుల పేర్లను బీసీసీఐ ప్రకటించింది. ఆసియా కప్లో పాల్గొనే భారత జట్టుకు కెప్టెన్గా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ వ్యవహారించనున్నాడు. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం ఆసియా కప్లో ఆడే భారత జట్టుని ప్రకటించారు.
వరుసగా మ్యాచ్లు ఆడుతున్న క్రమంలో విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చి.. కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించారు. జట్టులో భువనేశ్వర్, అంబటి రాయుడు, కేదర్ జాదవ్కు చోటు దక్కింది.సెప్టెంబరు 15న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆరంభమయ్యే ఆసియా కప్లో భారత్ సహా ఆరు జట్లు పోటీపడనున్నాయి.
భారత జట్టు సభ్యులు : రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్(వైస్ కెప్టెన్), ధోనీ, కేఎల్ రాహుల్, అంబటి రాయుడు, మనీష్ పాండే, కేదార్ జాదవ్, దినేష్ కార్తీక్, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, బూమ్రా, శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్