Tuesday, May 7, 2024
- Advertisement -

యూసుఫ్‌ప‌ఠాన్‌పై బీసీసీఐ నిషేధం

- Advertisement -

డోప్‌ టెస్ట్‌లో విఫలమ‌య్యాడ‌ని భార‌త క్రికెట్ జ‌ట్టు ఆట‌గాడు యూసుఫ్‌ప‌టాన్‌పై 5 నెలల వేటు వేస్తున్నట్లు భార‌త క్రికెట్ నియంత్ర‌ణ సంస్థ (బీసీసీఐ) ప్రకటించింది. దీంతో యూసుఫ్‌ పఠాన్ షాక్‌కు గుర‌య్యాడు. గతేడాది ఓ దేశీవాళి టీ-20 మ్యాచ్‌ సందర్భంగా ప‌ఠాన్‌కు పరీక్షలు చేశారు. ప‌రీక్ష ఫ‌లితాల్లో యూసుఫ్‌ నిషేధ ఉత్ప్రేరకాన్ని తీసుకున్నట్లు తేలింది.

టర్‌బ్యూటలైన్‌(దగ్గు మందుకు సంబంధించింది) పదార్థాన్ని యూసుఫ్‌ తీసుకోవ‌డంతో బీసీసీఐ ఆ నిర్ణ‌యం తీసుకుంది. ఆటగాడు ఆ డ్రగ్‌ను తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తే మాత్రం సంబంధిత అధికారులు అనుమతి తప్పనిసరిగా తీసుకొని వాడాలి. కానీ, పఠాన్‌ గానీ, టీం డాక్టర్‌ గానీ ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయలేదు. అనుమ‌తి లేకుండా డ్ర‌గ్ తీసుకోవ‌డంతో ప‌ఠాన్‌పై నిషేధం ప‌డింది.

ఇక డోపింగ్‌ ఆరోపణలు వచ్చినప్పుడే బీసీసీఐ అతన్ని తాత్కాలికంగా సస్పెండ్‌ చేసింది. దీంతో అతను రంజీ మ్యాచ్‌లకు కూడా దూరమ‌య్యాడు. పఠాన్‌ ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందిన బీసీసీఐ తక్కువ శిక్షతో సరిపెట్టింది. గత ఆగష్టు 15వ తేదీ నుంచి అతడిపై నిషేధం అమలులోకి రాగా.. ఆ లెక్కన జనవరి 14వ వ తేదీతో ఆ సస్పెన్షన్‌ ముగియనుంంది. దీంతో పఠాన్‌కు ఈ విష‌యం ఊరటనిచ్చే విషయం.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -