Monday, May 6, 2024
- Advertisement -

బీసీసీఐకి బిగ్‌షాక్ ఇచ్చిన సీఐసీ..

- Advertisement -

తమది స్వతంత్ర సంస్థ అని, తాము ప్రభుత్వ సంస్థల పరిధిలోకి రామని చాలా కాలంగా వాదిస్తున్న బీసీసీఐకి కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) షాక్ ఇచ్చింది. బీసీసీఐ సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావాల్సి ఉంటుందని ఆదేశించింది. సుప్రీం కోర్టు నియమించిన క్రికెట్‌ పాలకుల కమిటీ(సీఓఏ) నిర్లక్ష్యమే ఈ ఆదేశాలు రావడానికి కారణమని బీసీసీఐ అధికారులు విమర్శిస్తున్నారు.సీఐసీ తీర్పును సవాల్‌ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

జులై 10న సీఐసీ విచారణ జరిగింది. సమాచార హక్కు చట్టం పరిధిలోకి బీసీసీఐ ఎందుకు రాదో చెప్పాలని ప్రశ్నించింది. దీనికి బోర్డు బదులివ్వలేదు. దీంతో షోకాజ్‌ నోటీసులు వచ్చాయి. ప్రస్తుతం మేము చేయగలిగింది సీఐసీ ఉత్తర్వులను హైకోర్టులో సవాల్‌ చేయడమే’ అని బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితికి సీఓఏనే కారణమని బీసీసీఐ పేర్కొంటోంది. సీఓఏ పెద్దలు కావాలానే నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తోంది. సీఐసీ ఉత్తర్వులపై సీఓఏ అధినేత వినోద్ రాయ్ నేరుగా స్పందించలేదు. బోర్డు పారదర్శకత కోసం కృషి చేస్తున్నామని వెల్లడించిన ఆయన ఇప్పటికే వెబ్‌సైట్‌లో మార్పులు చేశామన్నారు. బోర్డులో సుపరిపాలన, నైతికి నిబంధనలు, పారదర్శకతకు తాము కట్టుబడ్డామని వెల్లడించారు.

సీఐసీ ఉత్తర్వులపై సీఓఏ అధినేత వినోద్‌ రాయ్‌ నేరుగా స్పందించలేదు. బోర్డు పారదర్శకత కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే వెబ్‌సైట్‌లో చాలా మార్పులు చేశామన్నారు. ప్రతి నిర్ణయాన్ని అందులో ఉంచుతున్నామని పేర్కొన్నారు. బోర్డులో సుపరిపాలన, నైతికి నిబంధనలు, పారదర్శకతకు తాము కట్టుబడ్డామని వెల్లడించారు. ప్రస్తుతం సీఐసీ ఉత్తర్వులపై న్యాయవాదులు నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -