Thursday, May 2, 2024
- Advertisement -

క్వాలిఫయర్ -1 స‌మ‌రం… ముంబ‌య్‌పై టాస్‌గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్‌కే…

- Advertisement -

ఐపీఎల్ 2019 ప్లేఆఫ్‌లో భాగంగా ముంబయి, సీఎస్‌కే మ‌ధ్య స‌మ‌రానికి ఆస‌న్న‌మైంది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ముంబ‌య్‌పై బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తాజా సీజన్‌ లీగ్ దశలో 14 మ్యాచ్‌లాడిన ముంబయి జట్టు 9 మ్యాచ్‌ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవగా.. చెన్నై కూడా 9 విజయాలు సాధించినా.. నెట్‌ రన్‌రేట్‌లో వ్యత్యాసం కారణంగా రెండో స్థానంతో సరిపెట్టుకుంది.

ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కి వెళ్లనుండగా.. ఓడిన టీమ్‌కి రెండో క్వాలిఫయర్‌ ద్వారా మరో అవకాశం ఉంటుంది. చెన్నై సొంత మైదానం చెపాక్‌‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. చెన్నై సొంతగడ్డ చెపాక్‌లో 2010 నుంచి ఒక్కసారి కూడా చెన్నై చేతిలో ముంబయి ఓడిపోలేదు. దీంతో.. ఈరోజు మ్యాచ్‌లో చెన్నైపైనే ఎక్కువ ఒత్తిడి ఉండే అవకాశం ఉంది.

ముంబయి: క్వింటన్‌ డికాక్‌, రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌, జయంత్‌ యాదవ్‌, రాహుల్‌ చాహర్‌, జస్ప్రీత్‌ బుమ్రా, లసిత్‌ మలింగ

చెన్నై: షేన్‌ వాట్సన్‌, మురళీ విజయ్‌, డుప్లెసిస్‌, సురేశ్‌రైనా, ఎంఎస్‌ ధోనీ, అంబటి రాయుడు, డ్వేన్‌ బ్రావో, రవీంద్ర జడేజా, హర్భజన్‌సింగ్‌, దీపక్‌ చాహర్‌, ఇమ్రాన్‌ తాహిర్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -