పీఎల్ 2018లో లీగ్ దశ ముగిసింది. కీలకమైన ప్లేఆఫ్కు సన్రైజర్స్, చెన్నైతోపాటు కోల్కతా, రాజస్థాన్ జట్లు అర్హత సాధించాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న సన్రైజర్స్, సూపర్ కింగ్స్ మధ్య మంగళవారం మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. ఈమ్యాచ్లో గెలుపొందిన జట్టు ఫైనల్కు వెల్తుంది.
అయితే క్వాలిఫైయర్-1లో ఓడిన జట్టు.. ఎలిమినేటర్లో గెలిచిన జట్టుతో శుక్రవారం క్వాలిఫైయర్-2లో తలపడుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్లో క్వాలిఫైయర్-1లో నెగ్గిన జట్టుతో ట్రోఫీ కోసం పోటీ పడుతుంది. ముంబైలో జరగనున్న తొలి క్వాలిఫైయర్ మ్యాచ్కు వరనుడు అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి.
ఒకవేళ వర్షం లేదా ఇతర కారణాల వల్ల అనుకోని పరిస్థితుల్లో ముంబైలో జరగనున్న తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ రద్దయితే.. ఏమవుతుందో తెలుసా..? పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న సన్రైజర్స్ నేరుగా ఫైనల్ చేరుతుంది. అప్పుడు చెన్నై క్వాలిఫైయర్-2 ఆడాల్సి ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్లో కోల్కతా, రాజస్థాన్లలో గెలిచిన జట్టుతో ధోనీ సేన తలపడుతుంది. లీగ్ దశలో రెండుసార్లు చెన్నై చేతిలో ఓడిన హైదరాబాద్ ప్లేఆఫ్లో ఎలా ఆడుతుందో చూడాలి మరి.