Sunday, May 12, 2024
- Advertisement -

పాంటింగ్ వ‌ల్లే నా ఆట‌తీరు మెరుగు ప‌రుచుకున్నా…విజ‌య్‌శంక‌ర్‌

- Advertisement -

పీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ప్లేఆఫ్‌కు చేర‌కుండానే లీగ్‌లోనే నిష్క్ర‌మించిన సంగ‌తి తెలిసిందే. కోచ్ రికీ పాంటింగ్ సూచనలతో తన ఆటతీరు పూర్తిగా మారిపోయిందని ఆల్‌రౌండ‌ర్ విజ‌య్ శంక‌ర్ తెలిపారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్‌లో మొత్తం 13 మ్యాచ్‌లాడిన శంకర్.. 212 పరుగులు చేశాడు. ఆప‌రుగుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోక‌పోయినా లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో వ‌చ్చిన శంక‌ర్ ఆ ప‌రుగులు సాధించ‌డం విశేష‌మే.

డెత్ ఓవర్లలో క్రీజులోకి వచ్చి శంకర్ హిట్టింగ్ చేసిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. తాజా సీజన్‌లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 54గా ఉండటం అతని దూకుడుకి నిదర్శనం.

ఈ ఏడాది మార్చి 18న బంగ్లాదేశ్‌తో జరిగిన ముక్కోణపు సిరీస్ ఫైనల్లో 19 బంతులాడిన విజయ్ శంకర్ కేవలం 17 పరుగులు మాత్రమే చేసి పేలవ రీతిలో ఔటయ్యాడు. ముఖ్యంగా.. ఆఖర్లో బంతుల్ని ఎక్కువగా వృథా చేయడంతో అతనిపై విమర్శల వర్షం కురిసింది.

ఇక ఐపీఎల్ 2018 సీజన్‌లో కూడా మొద‌టి మూడు మ్యాచ్‌ల్లో విఫ‌లం అయిన శంక‌ర్ విఫ‌లం అయ్యారు. రెండో మ్యాచ్ ముగిసిన తర్వాత కోచ్ రికీ పాంటింగ్ దగ్గరకి వెళ్లాను. నా ఆటకి ఎలా మెరుగులు దిద్దుకోవాలో సూచించాలని కోరాను. అప్పటికి నాకు నేను చాలా కఠిన పరిస్థితుల్లో ఉన్నట్లు ఊహించుకున్నా. కానీ.. రికీ పాంటింగ్.. నీ బ్యాటింగ్‌ టెక్నిక్‌ని మళ్లీ అందుకో చాలు.. అని చాలా తేలికపాటి సూచన చేశాడు.

సూచ‌న‌కు వనుగునంగానే నా ఆట‌తీరును మార్చుకున్నా. కచ్చితంగా ఈ ఏడాది ఐపీఎల్‌ నా కెరీర్‌ని మార్చేసింది. మిడిలార్డర్‌లో బ్యాటింగ్ స్థానాలు మార్చి బ్యాటింగ్‌ చేయాల్సి రావడంతో.. పరిస్థితులకి అనుగుణంగా ఆటతీరు మార్చుకున్నా’ అని విజయ్ శంకర్ వెల్లడించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -