Thursday, May 2, 2024
- Advertisement -

బెంగులూరుకు షాక్‌.. మ్యాచ్‌కు కోహ్లీ దూర‌మ‌య్యే అవ‌కాశం

- Advertisement -

త‌ప్పక గెల‌వాల్సిన మ్యాచ్‌లో బెంగులూరుకు పెద్ద షాక్ త‌గ‌ల‌నుంది. జ‌ట్టు కెప్టెన్ కోహ్లీ దూర‌మ‌య్యే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. ప్లే ఆఫ్ రేసు నుంచి ఢిల్లీ ఇప్ప‌టికే త‌ప్పుకుంది. నాలుగు బెర్త్‌ల కోసం ఏడు జట్లు పోటీ పడుతుండగా.. సన్‌రైజర్స్ ఇప్పటికే నాకౌట్ దశకు చేరుకుంది.

చెన్నైకూడా ప్లేఆఫ్‌కు చేరినట్టే లెక్క‌. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం పంజాబ్, ముంబై, కోల్‌కతా, రాజస్థాన్‌, బెంగళూరు తలపడుతున్నాయి. నేటి (శనివారం) సాయంత్రం పంజాబ్, కోల్‌కతా మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా.. రెండో మ్యాచ్‌లో ఢిల్లీతో బెంగళూరు తలపడనుంది.

ప్లే ఆఫ్ రేసు నుంచి వైదొలిగిన ఢిల్లీ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ మ్యాచ్ ఆడనుండగా.. తప్పక గెలవాల్సిన స్థితిలో కెప్టెన్ త‌ప్పుకోవ‌డం ఆ జ‌ట్టు పెద్ద దెబ్బే అని చెప్ప‌వ‌చ్చు. కీలకమై ఈ మ్యాచ్‌కు రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లి దూరం అవుతున్నట్లు తెలుస్తోంది. అతడికి ఒంట్లో బాగోలేదు. దీంతో ప్రాక్టీస్ సెషన్లోనూ పాల్గొనలేదు. ఒకవేళ కోహ్లి మ్యాచ్‌కు దూరమైతే.. డివిలియర్స్ జట్టును ముందుకు నడిపే అవకాశం ఉంది.

క్షిణాఫ్రికా కెప్టెన్‌గా పని చేసిన డివిలియర్స్ ఇప్పటి వరకూ ఆర్‌సీబీకి మాత్రం కెప్టెన్‌గా వ్యవహరించలేదు. ఒకవేళ కోహ్లి దూరమైతే మాత్రం దాని ప్రభావం ఆర్‌సీబీ విజయావకాశాలపై తీవ్రంగా ఉండనుంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -