- Advertisement -
ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్కు షాకిచ్చింది గుజరాత్ టైటాన్స్. రాజస్థాన్ విధించిన 197 పరుగుల లక్ష్యచేధనలో చివరి బంతికి గెలుపొందింది గుజరాత్. శుభ్మన్ గిల్ 44 బంతుల్లో 72, సాయి సుదర్శన్ 35,రాహుల్ తెవాటియా 22,రషీద్ ఖాన్ 24 నాటౌట్ తో చివరి బంతికి ఫోర్ కొట్టి గెలిపించారు. రషీద్ ఖాన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కొల్పోయి 196 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ 48 బంతుల్లో 76, సంజూ శాంసన్ 68 నాటౌట్ రాణించడంతో భారీ స్కోరు సాధించింది.
ఇవాళ ముంబై ఇండియన్స్తో తలపడనుంది ఆర్సీబీ. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుండగా మూడు మ్యాచ్ల తర్వాత నాలుగో మ్యాచ్ఓలో గెలుపొందింది ముంబై. బెంగళూరు ఐదు మ్యాచ్ లు కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది.