ముస్తఫిజూర్ రహ్మాన్ను ఐపీఎల్ 2026 సీజన్కు ముందు కోల్కతా నైట్రైడర్స్ విడుదల చేసిన నేపథ్యంలో, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టెలికాస్ట్పై నిరవధిక నిషేధం విధించింది.
ఇవాళ బంగ్లాదేశ్ అధికారులు ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఐపీఎల్కు సంబంధించిన అన్ని మ్యాచ్ల ప్రసారాలు, ప్రోగ్రామ్లు తక్షణమే నిలిపివేస్తున్నట్లు బంగ్లాదేశ్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది.
బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో, బీసీసీఐ ఆదేశాల మేరకు కోల్కతా నైట్రైడర్స్ బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తఫిజూర్ రహ్మాన్ను జట్టు నుంచి తప్పించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ విషయంపై బంగ్లాదేశ్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ వచ్చే సీజన్కు కోల్కతా నైట్రైడర్స్ జట్టు నుంచి బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తఫిజూర్ రహ్మాన్ను తప్పించాలన్న బీసీసీఐ నిర్ణయం బంగ్లాదేశ్ ప్రజలను తీవ్రంగా బాధపెట్టింది, నిరాశకు గురిచేసింది, ఆగ్రహానికి గురిచేసింది. ఈ పరిస్థితుల్లో, తదుపరి నోటీసు వచ్చే వరకు బంగ్లాదేశ్లో ఐపీఎల్ మ్యాచ్లు మరియు వాటికి సంబంధించిన అన్ని కార్యక్రమాల ప్రసారం నిలిపివేయబడుతుంది అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
