Thursday, May 16, 2024
- Advertisement -

స్వ‌ల్ప స్కోరుకే ఆలౌట్‌ అయిన టీమిండియా…

- Advertisement -

కోల్‌క‌తాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో జ‌రుగుతున్న భార‌త‌, శ్రీలంక జ‌గ్ల మధ్య జ‌రుగుతున్న మొద‌టి టెస్ట్ మ్యాచ్‌లో భార‌త్ అతి స్వ‌ల్ప స్కోరుకే ఆలౌట్ అయ్యింది. టాస్ గెలిసి శ్రీలంక ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. వ‌ర్షం కార‌నంగా ఆల‌స్యంగా ఆట ప్రారంభ‌మ‌యినా భార‌త్ ఆదిలోనె వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. రెండో రోజుకూడా అదే ఆట కొనసాగించింది. లంక బౌల‌ర్లు ఏద‌శ‌లోను భార‌త్ చుకున్న బౌలర్లు విజృంభించడంతో భారత్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఓవర్ నైట్ స్కోరు 74/5తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ 172 పరుగులకు ఆలౌట్ అయింది.

మూడో రోజు ఆరంభంలోనే పుజారా వికెట్ కోల్పోయిన భారత్‌ను జడేజా-సాహా జోడి ఆదుకునే ప్రయత్నం చేసింది. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 48 పరుగులు జోడించారు. అయితే శ్రీలంక స్పిన్నర్ పెరీరా వీరిద్దరినీ ఒకే ఓవర్‌లో అవుట్ చేసి భారత్‌కు షాకిచ్చాడు. తర్వాత భారత్ క్రమంగా వికెట్లు కోల్పోయింది. చివర్లో షమీ, ఉమేష్ మెరుపులు మెరిపించడంతో భారత్ ఈ స్కోరైనా చేయగలిగింది.

స్కోరు వివరాలు
భారత్ బ్యాటింగ్: రాహుల్ 0, ధవన్ 8, పుజారా 52, కోహ్లీ 0, అశ్విన్ 4, సాహా 29, జడేజా 22, భువనేశ్వర్ 13, షమీ 24, ఉమేష్ 6 నాటౌట్; మొత్తం: 59.3 ఓవర్లలో 172 ఆలౌట్

శ్రీలంక బౌలింగ్: లక్మల్ 4, షనక 2, పెరీరా 2, గమగె 2

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -