Saturday, May 18, 2024
- Advertisement -

మొద‌టి టెస్ట్‌లో ఒకే ఒక్క‌డు హార్ధిక్ పాండ్యా…

- Advertisement -

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కష్టాల్లో పడిన సమయంలో ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మాత్రం జోరును కొనసాగిస్తున్నాడు. ప్రధాన ఆటగాళ్లే చేతులెత్తేసిన చోట హార్దిక్‌ ఫోర్లతో దూకుడుగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. తొలి టెస్టులో సఫారీ బౌలర్లకి ఎదురునిలిచి ఒకే ఒక్క భారత బ్యాట్స్‌మెన్ అర్ధశతకంతో మెరిశాడు.

టెస్టుల్లో అపార అనుభవం ఉన్న ఆటగాళ్లు సైతం తడబడుతున్న పిచ్‌పై వరుస బౌండరీల మోత మోగించి తన ప్రత్యేకత చాటుకున్నాడు. అతనే గత ఏడాది శ్రీలంకపై టెస్టుల్లో మెరుపు శతకం బాది సుదీర్ఘ ఫార్మాట్‌లో తన ఆగమనాన్ని చాటిన హార్దిక్ పాండ్య. టీమిండియా 76/5తో పీకల్లోతు కష్టాల్లో నిలిచిన దశలో క్రీజులో వచ్చిన పాండ్య 46 బంతుల్లోనే 10 ఫోర్ల సాయంతో అర్ధశతకం బాదేసి సఫారీ బౌలర్లకి సవాల్ విసిరాడు.

హార్దిక్ పాండ్య క్రీజులోకి రాగానే హిట్టింగ్ చేస్తే ఫర్వాలేదు.. అతను సహనంతో ఉండి తర్వాత చెలరేగితేనే ప్రమాదం’ తొలి టెస్టుకి ముందు దక్షిణాఫ్రికా జట్టుకి ఆ దేశ మాజీ క్రికెటర్లు చేసిన హెచ్చరిక. వాళ్లు ఎవరూ కోహ్లి, పుజారా, రహనె గురించి మాట్లాడలేదు. కేవలం హార్దిక్ గురించే హెచ్చరించారు.

మురళీ విజయ్ (1), ధావన్ (16), పుజారా (26), కోహ్లి (5), రోహిత్ శర్మ (5), అశ్విన్ (12), సాహా (0) తక్కువ స్కోరుకే వికెట్ సమర్పించుకున్నా హార్దిక్ మాత్రం ప్రస్తుతం 60 బంతుల్లో 13×4, 1×6 సాయంతో 75 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. దీంతో భారత్ 165/7తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగిస్తోంది.

ఎన్నో ఆశలు పెట్టుకున్న సాహా కూడా డకౌట్‌గా పెవిలియన్‌ చేరడంతో భారత జట్టు వంద పరుగుల మార్కును చేరకుండానే ఏడో వికెట్‌ను నష్టపోయింది. ఆ దశలో మరమ్మత్తులు చేపట్టిన హార్దిక్‌ తనపై పెట్టుకున్న ఆశలకు న్యాయం చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -