టెస్టు క్రికెట్లో ఇరగదీసిన టీమిండియా యువ సంచలనం రిషబ్ పంత్కు వన్డేలో చోటు దక్కింది. వెస్టిండీస్లో జరగబోయే ఐదు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డే ఆడే టీమిండియా జట్టు సభ్యులను బీసీసీఐ ప్రకటించింది. ఇటీవల ముగిసిన రెండు టెస్టుల సిరీస్లో 92, 92 పరుగులతో మెరిసిన రిషబ్ పంత్ ఈ జట్టులో చోటు కల్పించారు.
రెగ్యులర్ వికెట్ కీపర్ ధోనీ కూడా జట్టులోనే ఉండటంతో.. కేవలం బ్యాట్స్మెన్గా మాత్రమే అతడిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. జట్టు ఎంపిక తీరు చూస్తుంటే.. రేపు రిషబ్ పంత్ వన్డే అరంగేట్రానికి మార్గం సుగుమమైనట్లేనని తెలుస్తోంది.
విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, సయీద్ ఖలీల్ను తొలి వన్డే కోసం ఎంపిక చేశారు. ఆదివారం గువాహటి వేదికగా తొలి వన్డే జరగనుంది.అయితే.. రేపు తుది జట్టులో మాత్రం ఖలీల్ అహ్మద్కి చోటు దక్కడం అనుమానంగా కనిపిస్తోంది.